ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు(Cyber Crimes) ఎక్కువయ్యాయి. సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతూ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న డబ్బు లూటీ చేస్తున్నారు. ఫోన్, మెసేజెస్(Messages), ఈ–మెయిల్(E-Mail), క్యూఆర్ కోడ్ (QR Code), లాటరీ ఇలా వివిధ మార్గాల్లో ఖాతాదారుల డబ్బు కాజేస్తున్నారు. అయితే, ఇప్పటివరకు బ్యాంక్ అకౌంట్ల(Bank Accounts) పై దృష్టి సారించిన నేరగాళ్లు.. ఇప్పుడు పీఎఫ్ అకౌంట్ల(PF Account) లోని అమౌంట్ను కూడా వదలడం లేదు. అందుకే, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఆన్లైన్ మోసాల(Frauds) గురించి సభ్యులను హెచ్చరిస్తూ కొన్ని సూచనలు చేసింది. నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా ఉండేందుకు ఈపీఎఫ్ ఖాతా(EPF Account), వ్యక్తిగత వివరాలు, ఓటీపీ(OTP) వంటి ముఖ్యమైన వివరాలను ఫోన్ లేదా ఆన్లైన్లో పంచుకోవద్దని సభ్యులను కోరింది.
ఇటీవలి కాలంలో ఈపీఎఫ్ లింక్డ్ ఓటీపీల ద్వారా మోసాలు పెరుగుతున్నందున ఈపీఎఫ్ఓ తాజా హెచ్చరిక జారీ చేసింది. ఈపీఎఫ్ఓ నుంచి కాల్ చేస్తున్నామని ఎవరైనా చెబితే, వారికి మీ ఆధార్ కార్డ్ నంబర్, పాన్ నంబర్, బ్యాంక్ ఖాతా నంబర్, UAN నంబర్ వంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దని కోరింది. కేవలం కాల్ ద్వారానే కాదు వాట్సాప్ లేదా ఏ ఇతర సోషల్ మీడియా యాప్స్ ద్వారా ఇతరులతో మీ వ్యక్తిగత వివరాలు పంచుకోకూడదని హెచ్చరించింది. ఈ మేరకు ఈపీఎఫ్ఓ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ట్వీట్ చేస్తూ “#EPFO తన సభ్యులను ఆధార్, పాన్, UAN, బ్యాంక్ ఖాతా లేదా OTP వంటి వ్యక్తిగత వివరాలను ఫోన్ లేదా సోషల్ మీడియా ద్వారా షేర్ చేయమని ఎప్పుడూ అడగదు. దయచేసి గమనించండి. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ కోల్పోకండి.” అని ట్వీట్లో పేర్కొంది.
EPF Interest: ఈపీఎఫ్ అకౌంట్కు వడ్డీ జమ చేయడంలో ఆలస్యం.. అసలు కారణం ఇదే..
ఈ ట్వీట్తో పాటు, ఈపీఎఫ్ఓ “మోసగాళ్ల పట్ల హెచ్చరిక” పేరుతో ఒక ఫోటోను కూడా షేర్ చేసింది. ఈపీఎఫ్ఓ ఏ సర్వీస్ కోసం అయినా.. ఎప్పుడూ మీ నుంచి డబ్బు డిపాజిట్ చేయమని అడగదని ట్వీట్లో పేర్కొంది. అందువల్ల, వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా మీ ఈపీఎఫ్ఓ వివరాలను పంపకూడదని సలహా ఇచ్చింది.
EPFO: పీఎఫ్ చందాదారులకు శుభవార్త.. వడ్డీపై ఆర్థిక శాఖ కీలక నిర్ణయం.. ఈ సారి ఎంతంటే..
డాక్యుమెంట్లను డిజిలాకర్లో భద్రపర్చుకోండి..
కాగా.. ఈపీఎఫ్ఓకు సంబంధిన ఏవైనా సమస్యలపై ఫిర్యాదు చేయాలంటే EPFO అధికారిక వెబ్సైట్ - www.epfindia.gov.inని సంప్రదించమని కోరింది. అలాగే, మీ అన్ని వ్యక్తిగత డాక్యుమెంట్లను డిజిలాకర్లో భద్రపర్చుకోండని తెలిపింది. డిజిలాకర్ మీ డాక్యుమెంట్లకు మరింత భద్రతనిస్తుంది. డిజిలాకర్ సురక్షితమైన క్లౌడ్ ఆధారిత ప్రభుత్వ ప్లాట్ఫారమ్. దీనిలో మీ డాక్యుమెంట్లకు సేఫ్టీ ఉంటుంది. అందువల్ల, డిజిలాకర్లో UAN కార్డ్, పెన్షన్ చెల్లింపు ఆర్డర్ (PPO), స్కీమ్ సర్టిఫికేట్ వంటివి భద్రపర్చుకోండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CYBER CRIME, Employees, Employees Provident Fund Organisation, EPFO