హోమ్ /వార్తలు /బిజినెస్ /

Hyundai: ఆ కంపెనీ కార్లలో లోపాలు .. అందుకే రీకాల్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు !

Hyundai: ఆ కంపెనీ కార్లలో లోపాలు .. అందుకే రీకాల్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు !

 ఆ కంపెనీ కార్లలో లోపాలు .. అందుకే రీకాల్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు !

ఆ కంపెనీ కార్లలో లోపాలు .. అందుకే రీకాల్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు !

దక్షిణ కొరియా(South Korea)కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్‌ (Hyundai), వినియోగదారుల భద్రత కోసం కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీకి చెందిన 70 వేలకు పైగా వాహనాలను స్వచ్ఛందంగా రీకాల్(Recall) చేయాలని నిర్ణయించింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్‌ (Hyundai), వినియోగదారుల భద్రత కోసం కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ(Company)కి చెందిన 70 వేలకు పైగా వాహనాలను స్వచ్ఛందంగా రీకాల్ చేయాలని నిర్ణయించింది. తమ వాహనాలలోని లోపాలు ఉన్న భాగాలను రిపేర్/రీప్లేస్ చేయడానికే హ్యుందాయ్ మోటార్ ఈ నిర్ణయం తీసుకుంది. హ్యుందాయ్ కంపెనీ 70,000 కంటే ఎక్కువ వాహనాలను రీకాల్ చేయనుందని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ (Transport Ministry) గురువారం తెలిపింది. ఎక్స్‌సియంట్ క్యూజెడ్ (Xcient QZ) హెవీ డ్యూటీ ట్రక్, కౌంటీ బస్సు (County bus)తో పాటు ఆరు మోడళ్లకు చెందిన 70,582 యూనిట్లను హ్యుందాయ్ రీకాల్ చేస్తున్నట్లు భూ, మౌలిక సదుపాయాలు, రవాణా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.

హ్యుందాయ్ కంపెనీతో పాటు ప్రముఖ కార్ల(Car) తయారీ కంపెనీ మెర్సిడెస్-బెంజ్(Mercedes Benz) కొరియా కూడా తన ఎలక్ట్రిక్ వాహనాలను రీకాల్ చేయడానికి సిద్ధమైంది. ఈ జర్మన్‌ కంపెనీ EQE 350+, EQS 450+ ప్యూర్ ఎలక్ట్రిక్ సెడాన్‌లతో సహా ఐదు మోడళ్ల 438 యూనిట్లను రీకాల్ చేయడానికి సిద్ధమైంది. కొద్ది రోజుల క్రితం హ్యుందాయ్ తన ఎక్స్‌సియంట్ క్యూజెడ్ ట్రక్‌లో ఆల్టర్నేటర్ కాంపోనెంట్‌లో లోపం ఉన్నట్లు గుర్తించింది. ఈ సమస్య వల్ల పవర్ ఔటేజ్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని కంపెనీ ట్రక్‌లను రీకాల్ చేయాలని నిర్ణయించింది. మెర్సిడెస్-బెంజ్ EQS 450+ ఆల్-ఎలక్ట్రిక్ సెడాన్‌ కారులో పింటిల్ హుక్ (Pintle hook)లో ఒక ఉందని ఆ కంపెనీ కూడా వీటిని రీకాల్ చేయనుంది.

ఇదీ చదవండి:  Mahindra EVs: ఇక అన్ని సెగ్మెంట్లలోకి ఈవీ కార్స్ లాంచ్.. మహీంద్రా ఫ్యూచర్ ప్లాన్ చూస్తే మతిపోతుందీ..!


 పైన పేర్కొన్న వాహనాల యజమానులు హ్యుందాయ్, మెర్సిడెస్-బెంజ్ సంస్థ రిపేర్ సర్వీస్ సెంటర్‌లను వరుసగా గురు, శుక్రవారాల్లో విజిట్ చేసి విడిభాగాలను ఉచితంగా రీప్లేస్ చేయించుకోవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. గ్రీన్-కార్ మార్కెట్‌లోకి అడుగుపెట్టిన 13 ఏళ్ల తర్వాత, జులైలో ఈ వాహనాల మొత్తం విక్రయాలు 1 మిలియన్ మార్కును అధిగమించాయని హ్యుందాయ్ మోటార్ గత వారం తెలిపింది. ఆటోమేకింగ్ దిగ్గజం హ్యుందాయ్, కియా కంపెనీ జులైలో మాత్రమే 29,484 ఎకో-ఫ్రెండ్లీ వాహనాలను విక్రయించాయని, వాటి మొత్తం అమ్మకాలు 1.024 మిలియన్లకు పెరిగాయని కంపెనీ తెలిపింది. జులై 2009లో హ్యుందాయ్ మోటార్ గ్రూప్ తన అవంటే సబ్ కాంపాక్ట్ హైబ్రిడ్ మోడల్‌ను విడుదల చేయడం ద్వారా ఎకో-ఫ్రెండ్లీ వాహన మార్కెట్లోకి ప్రవేశించింది. అనంతరం రికార్డు స్థాయిలో సేల్స్ నమోదు చేసింది.

గతంలో చాలా ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీలు కూడా రీకాల్స్ బాట పట్టాయి. అంతకంటే ముందు సంవత్సరాల్లో హ్యుందాయ్ మోటార్ ఇండియా, మహీంద్రా & మహీంద్రా, టయోటా కిర్లోస్కర్ మోటార్‌ కంపెనీలు కూడా వాహనదారుల శ్రేయస్సు కొరకు వాహనాలను రీకాల్ చేశాయి. ఈ కంపెనీలు ఫ్యూయల్ పంప్‌లు, ఎయిర్‌బ్యాగ్‌ల్లో లోపాలు, క్వాలిటీ చెక్ మిస్సయిన వాహనాలను రీకాల్ చేశాయి.

First published:

Tags: Automobiles, Hyundai, Kia cars, Mercedes-Benz

ఉత్తమ కథలు