హోమ్ /వార్తలు /బిజినెస్ /

Petrol Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుతో కేంద్ర ప్రభుత్వానికి ఎంత నష్టమో తెలుసా..?

Petrol Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుతో కేంద్ర ప్రభుత్వానికి ఎంత నష్టమో తెలుసా..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

కేంద్ర ప్రభుత్వం రెండు ఇంధనాలపై ఎక్సైజ్ సుంకాన్ని రూ.5 , రూ.10 తగ్గించింది (Excise Duty Cut). దీపావళి సందర్భంగా చేసిన ఈ ప్రకటన ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలను తగ్గించేందుకు, ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న సామాన్యులకు ఊరటనిస్తుందని కేంద్రం చెబుతోంది. అయితే దీని కోసం కేంద్ర ప్రభుత్వం ఆదాయానికి గండి పడనుంది.

ఇంకా చదవండి ...

ద్రవ్యోల్బణం నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి పెట్రోల్-డీజిల్ ధర Petrol Diesel Price రికార్డు స్థాయికి చేరిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రెండు ఇంధనాలపై ఎక్సైజ్ సుంకాన్ని రూ.5 , రూ.10 తగ్గించింది (Excise Duty Cut). దీపావళి సందర్భంగా చేసిన ఈ ప్రకటన ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలను తగ్గించేందుకు, ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న సామాన్యులకు ఊరటనిస్తుందని కేంద్రం చెబుతోంది. అయితే దీని కోసం కేంద్ర ప్రభుత్వం ఆదాయానికి గండి పడనుంది.

PF Aadhaar Link: మీ పీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేశారా? వెంటనే చేయండి ఇలా

ప్రతి నెలా రూ.8,700 కోట్ల ఆదాయంలో నష్టం వాటిల్లనుంది

ఏప్రిల్-అక్టోబర్ మధ్య వినియోగ డేటా ఆధారంగా, ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం వల్ల ప్రభుత్వానికి ప్రతి నెలా రూ.8,700 కోట్ల ఆదాయం తగ్గుతుంది. చమురు పరిశ్రమకు సంబంధించిన వర్గాల సమాచారం ప్రకారం, ఇది వార్షిక ప్రాతిపదికన రూ.లక్ష కోట్లకు పైగా ప్రభావం చూపుతుంది. అదే సమయంలో మిగిలిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.43,500 కోట్ల ప్రభావం ఉంటుంది. ఎక్సైజ్ సుంకం తగ్గింపు నవంబర్ 4 నుండి వర్తిస్తుందని మీకు తెలియజేద్దాం. దీంతో ఢిల్లీలో పెట్రోలు ధర ప్రస్తుతం లీటర్‌కు రూ.110.04 నుంచి రూ.105.04కి తగ్గగా, డీజిల్ ధర లీటర్‌కు రూ.98.42 నుంచి రూ.88.42కి తగ్గనుంది.

EPF Account: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త... అకౌంట్‌లోకి వడ్డీ జమ చేసేది ఎప్పుడంటే

ఎక్సైజ్ డ్యూటీలో ఇప్పటివరకు అతిపెద్ద కోత: FM

పెట్రోల్ , డీజిల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపును 4 నవంబర్ 2021 ఉదయం నుండి అమలు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయి. ఎక్సైజ్ డ్యూటీలో కోత విధించిన అతిపెద్దది ఇదే. దీనితో పాటు, మార్చి 2020 , మే 2020 మధ్య పెట్రోల్‌పై రూ. 13 , డీజిల్‌పై లీటరుకు రూ. 16 పెంచిన పన్నులలో కొంత భాగాన్ని ఉపసంహరించుకుంది. అప్పటి ఎక్సైజ్ సుంకం పెంపుతో పెట్రోల్‌పై కేంద్ర పన్ను లీటరుకు రూ. 32.9 , డీజిల్‌పై రూ. 31.8 వద్ద ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి నెట్టబడింది.

ఇదిలా ఉంటే దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ (Excise Duty) భారీగా తగ్గించింది. పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. ఈరోజు నుంచే తగ్గిన రేట్లు అమలులోకి వచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol Diesel Prices) భారీగా తగ్గాయి. ప్రజలకు మరింత లాభం చేకూర్చేందుకు వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ (VAT) కూడా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. పెట్రోల్, డీజిల్ ధరల్లో చాలావరకు పన్నులే ఉంటాయన్న విమర్శలు చాలాకాలంగా ఉన్నాయి. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ అంశాన్ని జీఎస్‌టీ కౌన్సిల్ పరిశీలిస్తోంది.

First published:

Tags: Petrol Price

ఉత్తమ కథలు