ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయిపోయి అప్పుడే 25 రోజులైపోయాయి. మరో మూడు వారాల్లో అంటే మే 23న ఫలితాలు వచ్చేస్తాయి. వాటి ప్రకారం కచ్చితంగా తామే అధికారంలోకి వస్తామనీ, తమకు మినిమం 100 సీట్లు... మాగ్జిమం 130 సీట్లు వస్తాయని భావిస్తున్న వైసీపీ అధినేత జగన్... వెంటనే ముఖ్యమంత్రి పీఠం ఎక్కి... పాలన సాగించేందుకు రెడీ అవుతున్నారని తెలిసింది. అందులో భాగంగానే ప్రస్తుతం ఆయన... తన కేబినెట్లో ఎవరెవరు మంత్రులుగా ఉండాలనే అంశంపై లోటస్ పాండ్లో లోతుగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. సమస్యేంటంటే... వైసీపీలో సీనియర్ నేతల కొరత ఉంది. వాళ్లలోనూ ఇదివరకు మంత్రులుగా చేసినవాళ్లు కొద్ది మందే.... అంటే... విజయనగరంలో బొత్స సత్యనారాయణ, తూర్పుగోదావరి జిల్లాలో పిల్లి సుభాష్ చంద్రబోస్, విశ్వరూప్, నెల్లూరులో ఆనం రామనారాయణ రెడ్డి, చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు తదితరులు మాత్రమే అనుభవంతో జగన్ పక్షాన అండగా నిలుస్తున్నారు. ఐతే... వీళ్లెవరూ జగన్ కోరుకుంటున్న అసెంబ్లీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను బలంగా నిర్వహిస్తారన్న ఆలోచనలో జగన్ లేనట్లు తెలుస్తోంది.
2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో... కొణిజేటి రోశయ్యను అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రిగా నియమించారు. మాటకారి, చతురుడైన ఆయన... తనకున్న రాజకీయ అనుభవంతో అప్పటి ప్రతిపక్షమైన టీడీపీకి గట్టిగానే సమాధానం ఇచ్చేవారు. ఎంతో అనుభవ ఉన్న చంద్రబాబు సైతం రోశయ్య మాటకారితనం ముందు తేలిపోయేవారు. నొప్పించక, తానొవ్వక అన్నట్లుగా వ్యవహరిస్తూ రోశయ్య అసెంబ్లీ వ్యవహారాల్ని జాగ్రత్తగా కొనసాగించారు.
ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వస్తే... 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబును ప్రతిపక్ష నేతగా ఎదుర్కోవడం తమకు సవాలేనని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన అంచనా ప్రకారం... వైసీపీకి మాగ్జిమం 130 సీట్లు వస్తే... ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి దాదాపు 60 నుంచీ 70 సీట్లు వస్తాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతమంది ప్రధాన ప్రతిపక్షంగా ఉంటే... వాళ్లందర్నీ కట్టడి చెయ్యాలంటే... సరైన మాటకారి నేత అసెంబ్లీ వ్యవహారాల మంత్రిగా ఉండాలని జగన్ అనుకుంటున్నారని తెలిసింది.
ప్రస్తుతం ఏపీ శాసనమండలిలో ఖాళీలు లేవు. ఈమధ్యే కొన్ని ఖాళీ సీట్లకు ఎన్నికలు జరిగాయి. మళ్లీ ఎన్నికలు వచ్చేందుకు రెండేళ్లు పడుతుంది. రెండు సభల్లో సభ్యుడు కాకుండా 6 నెలలు పాటూ ఉండవల్లి మంత్రిగా ఉండొచ్చు. ఆ తర్వాత ఎవరైనా ఎమ్మెల్సీని రాజీనామా చేయించి, ఆయన స్థానంలో ఉండవల్లిని తెచ్చే అవకాశాలున్నాయి. ఈ దిశగా జగన్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లే జరిగి... వైసీపీ అధికారంలోకి వస్తే, ఉండవల్లి అసెంబ్లీ వ్యవహారాల మంత్రిగా ఉంటే... ఇక తమకు టీడీపీ నుంచీ ఎలాంటి ఇబ్బందులూ ఉండబోవని జగన్ బలంగా నమ్ముతున్నట్లు తెలిసింది.
ఇవి కూడా చదవండి :
ఏపీలో రాజకీయ సంక్షోభం... టార్గెట్ చంద్రబాబు ? రాష్ట్రపతి పాలన తెస్తారా ?
మరింత పెరగబోతున్న ఎండల వేడి... ఫొణి తుఫాను ప్రభావమే...
కరెంటు షాక్ కొట్టిన కూలర్... ఆరేళ్ల చిన్నారి మృతి
చంద్రబాబు దృష్టి ఫలితాలపై... 4 నుంచీ ఓట్ల లెక్కింపు... సీట్ల సంఖ్య తేలుతుందా...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Chandrababu naidu, Jagan, Tdp, Undavalli Arun Kumar, Ys jagan, Ysrcp