హోమ్ /వార్తలు /andhra-pradesh /

వీవీప్యాట్ల లెక్కింపు ప్రజల కోసమా... చంద్రబాబు కోసమా... వైసీపీ ఎందుకలా అంటోంది....

వీవీప్యాట్ల లెక్కింపు ప్రజల కోసమా... చంద్రబాబు కోసమా... వైసీపీ ఎందుకలా అంటోంది....

AP Assembly Election 2019 : ఈవీఎంలపై ప్రజల్లో ఉన్న అపనమ్మకాన్ని తగ్గించేందుకు తెచ్చినవే వీవీప్యాట్లు. మరి వాటిలో స్లిప్పులను లెక్కించాల్సిందేనా...

AP Assembly Election 2019 : ఈవీఎంలపై ప్రజల్లో ఉన్న అపనమ్మకాన్ని తగ్గించేందుకు తెచ్చినవే వీవీప్యాట్లు. మరి వాటిలో స్లిప్పులను లెక్కించాల్సిందేనా...

AP Assembly Election 2019 : ఈవీఎంలపై ప్రజల్లో ఉన్న అపనమ్మకాన్ని తగ్గించేందుకు తెచ్చినవే వీవీప్యాట్లు. మరి వాటిలో స్లిప్పులను లెక్కించాల్సిందేనా...

    ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగినప్పుడు... తలెత్తిన ఉద్రిక్తలపై కంటే... ఈవీఎంల పనితీరు, వీవీప్యాట్ల స్లిప్పులపై ఎక్కువ చర్చ జరుగుతోంది. అసలు ఈవీఎంలపై అనుమానాలను నివృత్తి చేసేందుకు రూ.9 కోట్లు ఖర్చు పెట్టి వీవీప్యాట్ యంత్రాల్ని వాడకంలోకి తెచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. ప్రజలు తాము ఎవరికి ఓటు వేశారో... వీవీప్యాట్‌లో 7 సెకండ్ల పాటూ కనిపించే స్లిప్‌ని చూడటం ద్వారా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ఆ స్లిప్.. యంత్రంలో పడిపోతుంది. ఎవరైనా తాము నొక్కిన గుర్తుకు ఓటు పడలేదని భావిస్తే, వెంటనే ఈసీ అధికారులను ప్రశ్నించవచ్చు. అది నిరూపించేందుకే వీవీప్యాట్లను తెచ్చింది ఈసీ. ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో ఓటు వేసిన ప్రజలంతా... వీవీప్యాట్లలో ఎవరికి ఓటు పడిందో చూసుకున్నవారే. ఒకట్రెండు చోట్ల ఒక గుర్తుకు ఓటేస్తే, వేరే గుర్తుకు ఓటు పడినట్లు వీవీప్యాట్ స్లిప్పులలో కనిపించిన మాట వాస్తవమే. అలాంటి చోట ఎన్నికల ప్రక్రియను అధికారులు ఆపివేశారు కూడా.

    50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాల్సిందేనని టీడీపీ అధినేత చంద్రబాబు పట్టుపడుతుండటంపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర స్థాయిలో తప్పుపడుతున్నారు. ప్రజలంతా ఓటు వేసి, ఎవరికి పడిందో వీవీప్యాట్ స్లిప్పులలో చక్కగా చూసుకొని ప్రశాంతంగా ఉంటే... చంద్రబాబు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు ఆయన. ప్రజలకు లేని బాధ, చంద్రబాబుకు ఎందుకని నిలదీస్తున్నారు. 80 శాతం ప్రజలు ఓటు వేసి... ఎలాంటి కంప్లైంట్లూ ఇవ్వకుండా హాయిగా ఉంటే.... చంద్రబాబు మాత్రం ఏదో జరిగిపోయినట్లు హడావుడి చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు జగన్. పోలింగ్ జరుగుతున్నప్పుడు... 40 వేలకు పైగా పోలింగ్ బూత్‌ల దగ్గరున్న టీడీపీ ఏజెంట్లు ఎందుకు ప్రశ్నించలేదని జగన్ అడుగుతున్నారు.

    ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న దానికంటే... ప్రస్తుతం వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అంశమే ఆంధ్రప్రదేశ్‌లో దుమారం రేపుతోంది. దీనిపై మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తామని చంద్రబాబు చెబుతుండటం వల్ల... ఈ అంశం ఇప్పట్లో చల్లారే అవకాశాలు కనిపించట్లేదు.

    ఇవి కూడా చదవండి :

    50 శాతం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాల్సిందే... మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తామన్న చంద్రబాబు...

    ప్రేమించుకున్నారు... బ్రేకప్ అయ్యింది... ఆ తర్వాత ఆమెకు పోర్న్ ఫొటోలు పంపి...

    లవర్‌ని ఏటీఎం కార్డులా వాడుకుని పరారైన ప్రియుడు.. కోపంతో ప్రియురాలు..

    టార్గెట్ కేసీఆర్... చంద్రబాబు ప్లాన్ అదేనా... 40 రోజుల్లో ఏం చెయ్యబోతున్నారంటే...

    First published:

    ఉత్తమ కథలు