విశాఖ గ్యాస్ లీక్ ఘటన నగర వాసులకు నిద్ర లేకుండా చేస్తోంది. నిన్న రాత్రి మరోసారి గ్యాస్ లీకైందన్న పుకారు చెలరేగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఫ్యాక్టరీ చుట్టుపక్కల వాళ్లు, ఇతర ప్రాంతాల్లోని ప్రజలు నిద్ర లేని రాత్రిని గడిపారు. ముల్లె మూట సర్దుకొని రోడ్ల మీదకు వచ్చి జాగారం చేశారు. దీంతో ఆ ప్రాంగణమంతా జాతరను తలపించింది. వేల మంది కంచరపాలెం, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. సన్నిహితులకు ఫోన్లు చేసుకొని అప్రమత్తం అవుతున్నారు. రాత్రి 11 గంటలు దాటాక కూడా పెట్రోల్ బంకులు ఫుల్ అయ్యాయి. ఏ వాహనం దొరికితే ఆ వాహనంలో వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు. వీలుకాని వాళ్లు కొందరు రోడ్లపైనే నిద్రపోయారు. అటు.. రాత్రి పదిన్నరకు గుజరాత్ బృందం విశాఖకు చేరుకుంది. స్టైరిన్ గ్యాస్ లీకేజీ నియంత్రణకు ప్రయత్నాలు చేపట్టారు.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.