విశాఖలో విషాదం చోటు చేసుకుంది. ఓసాఫ్ట్వేర్ ఉద్యోగిని ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది.ఈ ఘనట పెందుర్తి మండలం దువ్వుపాలెంలో చోటుచేసుకుంది. పెందుర్తి సీఐ అప్పారావు తెలిపిన వివరాలివీ.. హైదరాబాద్కు చెందిన సౌజన్య(26)కి, అమెజాన్లో సాఫ్ట్ వేర్ గా పనిచేస్తుంది. ఈ క్రమంలో ఆమెకు శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన హనుమంతు గిరిప్రసాద్తో 8 నెలల కిందట వివాహం జరిగింది. మూడు నెలల కిందట వీరు దువ్వుపాలెంలో ఇళ్లు కొనుగోలు చేసి నివసిస్తున్నారు.
సౌజన్య భర్త గిరిప్రసాద్ నగరంలోని ఓ ఆస్పత్రిలో దంత వైద్యుడిగా పనిచేస్తున్నాడు. సౌజన్య అమెజాన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది అయితే ఆమె.. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోం ద్వారా విధులు నిర్వర్తిస్తోంది. వీరి వివాహం సమయంలో సౌజన్య తండ్రి విష్ణు.. గిరిప్రసాద్కు 6లక్షల నగదు, 13 తులా ల బంగారం కట్నకానుకలుగా ఇచ్చారు. అయితే గిరిప్రసాద్కు మాత్రం అవి సరిపోలేదు.
దీంతో నిత్యం డబ్బులు కోసం భార్యను వేధించేవాడు. పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని సౌజన్యతో గిరిప్రసాద్ తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో రాత్రిపూట మద్యం సేవించి ఇంటికి వచ్చేవాడు. శనివారం సాయంత్రం గిరిప్రసాద్ ఆస్పత్రిలో విధులు ముగించుకుని ఇంటికి వచ్చాడు, తలుపు తీసి చూసే సరికి సౌజన్య ఉరివేసుకుని ఉంది. దీంతో ఒక్కసారిగా షాక్ తిన్న అతడు.. ఈ విషయాన్ని సౌజన్య తల్లిదండ్రులకు తెలిపాడు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరకట్నం వేధింపుల కింద కేసు నమోదు చేసి సీఐ అప్పారావు, ఎస్ఐ సురేష్ దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Visakhapatnam, Vizag