హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag News: వైజాగ్‌లో కలర్‌ఫుల్ స్కై.. కారణం ఇదే..!

Vizag News: వైజాగ్‌లో కలర్‌ఫుల్ స్కై.. కారణం ఇదే..!

X
విశాఖ

విశాఖ ఆర్కే బీచ్ లో కైట్ ఫెస్టివల్ ప్రారంభం

జి-20 సదస్సు గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు విశాఖ రామకృష్ణ బీచ్ (Vizag RK Beach) లో బోట్ రైడింగ్, కైట్ ఫెస్టివల్స్ లను విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ మల్లిఖార్జున ప్రారంభించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Setti Jagadeesh, News 18, Visakhapatnam

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో ఉన్న అందమైన సాగర నగరం విశాఖపట్నం (Visakhapatnam). ఈ మహానగరానికి వాణిజ్యపరంగానే కాదు పర్యాటకంగానూ ప్రత్యేక స్థానం ఉంది. విశ్వవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో ప్రతిష్టాత్మకమైన జీ-20 సదస్సు ఏర్పాట్లు ఊపందుకున్నాయి. విశాఖ వేదికగా ఈనెల 28, 29, 30 తేదీలలో మూడు రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న జి-20 సదస్సు గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు విశాఖ రామకృష్ణ బీచ్ (Vizag RK Beach) లో బోట్ రైడింగ్, కైట్ ఫెస్టివల్స్ లను విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ మల్లిఖార్జున ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖలో నిర్వహించే ప్రతిష్టాత్మమైన జీ-20 సదస్సు పట్ల ప్రజలను భాగస్వాములను చేయడానికి వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా బోట్ రైడింగ్, కైట్ ఫెస్టివల్ అన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.

విశాఖలో జీ-20 సదస్సు ప్రచారంలో భాగంగా ఆర్కేబీచ్ లో జీ-20 సదస్సు సెక్సెస్ అయ్యేందుకు నిర్వహించిన గాలి పటాలు (పతంగులు) పండుగ అంగరంగ వైభంగా సాగింది. సందర్శకులు, స్థానికులు, పర్యాటకులు తమతో తీసుకొచ్చిన గాలిపటాలు ఎగరేయడంతో విశాఖ నగరం అంతా మరోసారి సంక్రాంతి శోభను సంతరించుకున్నట్లు కన్పించింది.

ఇది చదవండి: ఆ ఆలయం చుట్టూ గాడిదల ప్రదక్షిణ.. ఎందుకో తెలుసా..?

చిన్నా, పెద్దా వయస్సుతో తారతమ్యం లేకుండా గాలిపటాలను ఎగురవేయడంతో ఆకాశంలో సంక్రాంతి ముగ్గు వేసిన మాదిరిగా ఎక్కడ చూసినా రంగు రంగులు గాలిపటాలు ఎగురుతూ కనిపించాయి. జీ-20 సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి విభిన్న వర్గాల చెందిన ప్రతినిధులు విశాఖకు విచ్చేస్తున్న నేపథ్యంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పేందుకు ఆకాశంలో రంగురంగుల గాలిపటాలు ఎగురవేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో సాగరతీరానికి విచ్చేసిన యువకులు కేరింతలు కొడుతూ ఉల్లాసంగా ఉత్సహంతో తమతో పాటు తీసుకొచ్చిన రంగురంగుల గాలిపటాలను ఆకాశంలో ఎగరవేసి వారు కూడా సంతోషాన్ని పంచుకున్నారు. ఆదే విధంగా నేవీ హెలికాప్టర్ జి-20 ఫ్లాగ్ తో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. ఇది ప్రజలను మరింత ఉత్సాహపరచింది.

First published:

Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam

ఉత్తమ కథలు