Holidays: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) కీలక ఆదేశాలు జారీ చేసింది. వారందరికీ వెంటనే సెలవులు (Holidays) ఇవ్వాలని సూచించింది. H3N2 వైరస్.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో టెర్రర్ లేపుతోంది. అయితే ఇది ఇప్పటిది కాదని.. వందేళ్ల నాటి వైరస్. ప్రతి సంవత్సరం అనేక సార్లు మ్యుటేట్ అవుతూ వస్తోంది. ఇది జనవరిలోనే స్టార్టయ్యిందని చెబుతున్నారు. ఇప్పుడు పీక్కి చేరింది. చాలామంది దీని బారిన పడి కోలకున్నారు. ఈ వైరస్ (Virus) ఒక్కసారి మనిషిలోకి ఎంటరయ్యాక సత్తువ లేకుండా చేస్తుంది అంటున్నారు వైద్య నిపుణులు.. జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి అంటున్నారు. అంతేకాదు ఫీవర్ కూడా రావొచ్చని చూస్తున్నారు. ఒకవేళ అన్నీ తగ్గినా.. దగ్గు మాత్రం 2, 3 వారాలు వెంటాడుతుంది. ఈ క్రమంలోనే ఏపీ వ్యాప్తంగా H3N2 వైరస్ పై అవగాహన కల్పిస్తున్నామని డైరక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ వినోద్ కుమార్ (Vinod Kumar) తెలిపారు. ప్రస్తుతం ఈ వైరస్ గుంటూరు (Guntur), విజయవాడ (Vijayawada) ప్రాంతాలలో గతంలో వచ్చి పోయిందన్నారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర ప్రాంతంలోని విశాఖలో ఎక్కువగా కన్పిస్తోందన్నారు.
ఈ వ్యాధి లక్షణాల్లో ముఖ్యంగా ముక్కు నుంచి గొంతు వరకు దీని ప్రభావం ఉంటుందని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలగా ఈ వైరస్ మ్యూటేషన్ అవుతూ వస్తోందని వెల్లడించారు. మొదటి మూడు, అయిదు రోజులు జ్వరం వస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నారులకు.. వృద్దులకు ఈ వైరస్ వల్ల లంగ్స్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం వస్తుందంటున్నారు. ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాలని సూచించారు.
ఒకవేళ ఈ వైరస్ సోకితే విద్యార్థులను స్కూళ్లకి పంపవద్దని తల్లిదండ్రులకు కూడా సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబు, నీరసంగా ఉన్న పిల్లలను తల్లిదండ్రులు బడులకు పంపొద్దని కోరారు. వారికి సెలవులు ఇవ్వాలని పాఠశాలల హెడ్ మాస్టర్లకు కూడా సూచించారు. బయట నుంచి ఇంటికి రాగానే చేతులు కడుక్కోవాలని.. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సీజన్ లో వచ్చే దగ్గు, జలుబు, జ్వరం ఈ వైరస్ ద్వారా వచ్చినదిగానే భావించాలని…రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిని ఇది ఎక్కువ ఇబ్బంది పెడుతుందిని తెలిపారు. వైద్యుల సలహాల మేరకే యాంటిబయాటిక్స్ వాడాలన్నారు.
ఇదీ చదవండి : పాపం సాగర తీరంలో అనుకోని అతిథి.. మత్స్యకారుల ప్రయత్నం విఫలం
కొన్ని రెమెడీస్ కూడా సూచించారు. వేడి నీళ్లు తాగడం.. వేడి నీటిలో ఉప్పు వేసి గొంతులో పోసుకొని పుక్కిలించడం, పసుపు అల్లం కషాయం టీ కప్పులో నాలుగు రోజులు వేసుకోవడం.. అలాగే బాగా వాటర్ తాగుతూ.. రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటూ దీని నుంచి బయటపడొచ్చు అని చెబుతున్నారు. జనవరిలో 12 కేసులు, ఫిబ్రవరిలో 9 కేసులు నమోదైనట్టు తెలిపారు డాక్టర్ వినోద్ కుమార్.. ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాలని స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap government, AP News, AP Schools, Virus, Visakhapatnam