Visakha Express : సికింద్రాబాద్ నుంచి భూవనేశ్వర్ వెళ్లే విశాఖ ఎక్స్ప్రెస్ (ట్రైన్ నంబర్ 17016) షెడ్యూల్ని మార్చారు రైల్వే అధికారులు. మామూలుగా ఈ ట్రైన్ రోజూ సాయంత్రం 4.50కి సికింద్రాబాద్ నుంచి వెళ్తుంది. ఇవాళ (20 మార్చి 2023) మాత్రం ఈ రైలు... సాయంత్రం 6.20కి బయలుదేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి రైల్వే అధికారులు షెడ్యూల్ ప్రకటన రిలీజ్ చేశారు.
మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విశాఖ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తారు. ఇవాళ ఆ ఎక్స్ప్రెస్ టైమింగ్స్ మారాయి కాబట్టి.. ప్రయాణికులు అందుకు తగ్గట్టుగా తమ ప్రయాణాన్ని సెట్ చేసుకోవడం బెటరని రైల్వే అధికారులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.