VIJAYAWADA TOLLYWOOD HERO AKKINENI NAGARJUNA MEETS AP CM YS JAGAN MOHAN REDDY IN TADEPALLI ANDHRA PRADESH FULL DETAILS HERE PRN
Nagarjuna Meets YS Jagan: వైఎస్ జగన్ నా శ్రేయోభిలాషి.. అందుకే వచ్చా..! సీఎంతో భేటీపై నాగార్జున క్లారిటీ..
సీఎం జగన్ తో నాగార్జున భేటీ
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో (AP CM YS Jagan Mohan Reddy) టాలీవుడ్ (Tollywood) హీరో నాగార్జున (Akkineni Nagarjuna) భేటీ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో (AP CM YS Jagan Mohan Reddy) టాలీవుడ్(Tollywood) హీరో నాగార్జున (Akkineni Nagarjuna) భేటీ అయ్యారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చిన నాగార్జునతో సీఎం జగన్ లంచ్ చేశారు. అనంతరం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పలు అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. నాగార్జునతో పాటు నిర్మాతలు ప్రీతం రెడ్డి, నిరంజన్ రెడ్డి కూడా భేలో పాల్గొన్నారు. సినిమా ఇండస్ట్రీ సమస్యలపై కొంతకాలంగా టాలీవుడ్ (Tollywood) పెద్దలు ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. ఈనేపథ్యంలో నాగార్జున.. జగన్ తో ఏం చర్చించారనేది ఆసక్తికరంగా మారింది. భేటీ ముగిసిన తర్వాత కూడా ఏం మాట్లాడరనే అంశంపై నాగార్జున వివరాలు వెల్లడించలేదు.
ఐతే హైదరాబాద్ (Hyderabad) వెళ్లే ముందు ఎయిర్ పోర్టు వద్ద మీడియాతో మాట్లాడిన నాగార్జున... విజయవాడ రావడం ఆనందంగా ఉందన్నారు. సీఎం జగన్ తన శ్రేయోభిలాషి అని.. ఆయన్ను కలిసి చాలా రోజులు అవుతోందని అందుకే వచ్చానన్నారు. ఇద్దరం కలిసి లంచే చేశామన్న నాగార్జున.. ఏం చర్చించారనే వివరాలను మాత్రం చెప్పలేదు.
కొంతకాలంగా టాలీవుడ్ పెద్దలు సీఎం జగన్ తో భేటీ వాయిదా పడుతూ వస్తోంది. రెండు నెలలుగా ఈ మీటింగ్ కు సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఐతే సీఎం జగన్ తో భేటీకి టాలీవుడ్ నుంచి కేవలం నాగర్జున, మరో ఇద్దరు, ముగ్గురు ప్రముఖులు తప్పితే ఎవరూ రాలేదు. గతంలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), నాగార్జున, రాజమౌళి (SS Rajamouli), కొరటాల శివ (Koratala Shiva), దిల్ రాజు (Dil Raju), సురేష్ బాబు వంటి పెద్దలు జగన్ ను కలిసేందుకు వచ్చారు. ఇప్పుడు నాగర్జున లీడ్ తీసుకోని రావడం ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఏపీ సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణచేసే ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. ఏపీ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డెవలప్ కార్పొరేషన్ ద్వారా సినిమా టికెట్ల ఆన్ లైన్ విక్రయానికి చట్టంలో సవరణలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సినిమా టికెట్ల విక్రయంపై ఇప్పటికే కమిటీ వేసిన రాష్ట్రప్రభుత్వం తాజాగా కేబినెట్ లోనూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసెంబ్లీలో చట్టసవరణకు ఆమోదం తెలిపిన తర్వాత పూర్తిస్థాయి విధివిధానాలు ఖరారయ్యే అవకాశముంది.
ఇక ప్రభుత్వ ఆధ్వర్యంలో సినిమా టికెట్ల విక్రయంపై కొంతకాలంగా రాజకీయ దుమారం రేగుతున్న సంగతి తేలింది. జనసేన(Janasena Party) అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. (Power Star Pawan Kalyan) ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టిన సంగతి తెలిసిందే. నిర్మాతలు సినిమాలు తీస్తే ప్రభుత్వం టికెట్లు అమ్మడమేంటని పవన్ ప్రశ్నించారు. అంతేకాదు సినిమా టికెట్లపై రాబడిని చూపించి అప్పుతెచ్చుకునేందుకు ఏపీ ప్రభుత్వం భావిస్తోందని అందుకే ఆన్ లైన్ సిస్టమ్ అంటోదని పవన్ ఆరోపించారు. పవన్ విమర్శలపై టాలీవుడ్ లో మిశ్రమ స్పందన వచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.