హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Sad News: అన్నకు ఆనందంగా రాఖీ కట్టిన చెల్లెలు.. కానీ కాసేపటికే అతడు విషాద వార్త వినాల్సి వచ్చింది...

Sad News: అన్నకు ఆనందంగా రాఖీ కట్టిన చెల్లెలు.. కానీ కాసేపటికే అతడు విషాద వార్త వినాల్సి వచ్చింది...

ఉష (ఫైల్)

ఉష (ఫైల్)

భర్తకంటే తనకే ఎక్కువ జీతం రావడంతో కొంతకాలంగా అత్తింటివారు ఆమెను వేధిస్తున్నట్లు తెలుస్తోంది.

అన్నా రఘు, గుంటూరు ప్రతినిధి, న్యూస్18

రంక్షా బంధన్ సందర్భంగా ఆ అన్నాచెల్లెళ్లిద్దరూ ఆనందంగా గడిపారు. అన్న ఇంటికి రావడంతో అతడికి రాఖీ కట్టింది. చెల్లెలికి కానుక ఇచ్చి ఆనందంగా వెనుదిగిరిన అన్నకు ఫోన్ వచ్చింది. అవతలివారు చెప్పిన వార్త విని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అన్న క్షేమంగా ఉండాలని రాఖీ కట్టిన చెల్లెలు... అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. అత్తింటి వేధింపులో లేక మరేదైనా కారణమో గానీ అనుమానాస్పద స్థితితిలో మృతి చెందింది. అన్నకు రాఖీ కట్టిన రెండు గంటల్లోనే చెల్లెలు మృతి చెందడంతో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణాజిల్లా విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు గ్రామానికి చెందిన ఉష అనే యువతి రెండేళ్ల క్రితం అరండల్ పేటకు చెందిన ఫణి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఫణి మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తుండగా.. ఉష సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తోంది.

ఇదిలా ఉంటే ఆదివారం రాఖీ పౌర్ణమి కావడంతో ఆమె సోదరుడు సూర్యనారాయణ సాయంత్రం 4గంటలకు ఉ ష ఇంటికి వచ్చి రాఖీ కట్టించుకొని వెళ్లాడు. అన్నకు ఆనందంగా రాఖీ కట్టిన ఉష.. అతడికి స్వీట్ తినిపించి సాగనంపింది. అతడు వెళ్లిన రెండు గంటలకే ఉష చనిపోయిందంటూ అత్తింటివారు ఫోన్ చేశారు. వెంటనే అక్కడికి వెళ్లిన సూర్యనారాయణ చెల్లెలు మృతదేహాన్ని చూసి కుప్పకూలిపోయాడు. రాఖీ పండుగ రోజే తోడబుట్టిన చెల్లెలలు దూరమైపోయిందని బోరున విలపించాడు.

ఇది చదవండి: వీడని సింధు డెత్ మిస్టరీ.. ప్రియుడే చంపాడా..? మధ్యలో ఆమె ఎవరు..?


 ఇదిలా ఉంటే ఉష మృతిపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. భర్త చిన్న ఉద్యోగం చేస్తుంటగా.., ఉష సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తోంది. భర్త కంటే తనకే ఎక్కువ జీతం రావడంతో కొంతకాలంగా అత్తింటివారు ఆమెను వేధిస్తున్నట్లు తెలుస్తోంది. అత్తింటివారే తమ కుమార్తెను మానసికంగా, శారీరకంగా వేధించి హత్య చేశారని ఉష కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఉష మృతితో తమకేమీ సంబంధం లేదని.. ఇంట్లో కళ్లు తిరిగి పడిపోయిందని.. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు ఆమె భర్త, బంధువులు చెప్తున్నారు. అనుమానాస్పద స్థితిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది చదవండి: తండ్రిలాంటి వాడని అతడి బైక్ ఎక్కింది.. కానీ ఇంత దారుణానికి ఒడిగడతాడని ఊహించలేకపోయింది..


 ఉష భర్త ఫణి, అత్తింటివారిని పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అదివారం సాయంత్రం ఇంట్లో ఏం జరిగింది..? భార్యాభర్తలు ఏమైనా గొడవపడ్డారా..? ఆమెతో అత్తమామలు, ఇతర బంధువుల ప్రవర్తన ఎలా ఉండేదన్న దానిపై ఆరాతీస్తున్నట్లు సమాచారం. మరోవైపు అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె ప్రేమ పెళ్లి చేసుకున్న రెండేళ్లకే తమకు శాశ్వతంగా దూరమవడంపై ఉష తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆమె అత్తింటివారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Crime news, Raksha Bandhan, Vijayawada

ఉత్తమ కథలు