వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా యాక్టివ్ గా పనిచేస్తున్న ఎర్రంశెట్టి ఆంజనేయులు ఆర్ధిక నేరాలకు పాల్పడడంతో మూడు నెలల క్రితం పార్టీ నుండి సస్పెండ్ అయ్యాడు. వత్సవాయి మండలంలో వీఆర్ఓగా పనిచేస్తున్న చెన్నారపు సత్యనారాయణ అనారోగ్యంతో మృతి చెందడంతో అతని భార్య గొడుగు మల్లేశ్వరికి ప్రభుత్వం వీఆర్ఏగా ఉద్యోగ అవకాశం కల్పించింది.
మల్లేశ్వరికి మాయమాటలు చెప్పిన ఆంజనేయులు ఆమెనుండి ఏటీఎం కార్డు బ్యాంకు పాస్ బుక్ లు తీసుకొని బ్యాంకుకు సంబంధించిన లావాదేవీలకు తన ఫోన్ నెంబర్ ఇచ్చి తానే స్వయంగా డబ్బులు డ్రా చేసుకొని వాడుకునేవాడు. అమాయకురాలేనా మల్లేశ్వరినిమోసం చేసిన ఆంజనేయులు తన మేనల్లుడినిదత్తత తీసుకున్నట్లు దస్తావేజులు సృష్టించి ఆమె సొంత ఇంటిని కూడా అతని పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించాడు. ఆంజనేయులు పట్టణంలోనే మల్లేశ్వరి తో పాటు మరికొందరిని మోసం చేసినట్లు పోలీసులతో లోతైన దర్యాప్తు చేయగా అతను ఆర్థిక నేరాలు బయటపడ్డాయి.
పార్టీ పేరు చెప్పుకొని అందరిని బెదిరిస్తూ అధికార దర్పం చూపించే వికలాంగుడైన ఆంజనేయులు లక్షలాది రూపాయలు అమాయక ప్రజలు మోసం చేసే విధానం ఒక్కొక్కటిగా బయటికి వెలుగు చూపుతున్నాయి.
ఆంజనేయులు చేతిలో మోసపోయిన వారు ఎవరైనా ఉంటే నేరుగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలియజేశారు. ఆ మహిళ భర్త వీఆర్వోగా విధుల నిర్వహిస్తు చనిపోయాడు. భర్త మరణం తర్వాత ఆమెకు వితంతు పెన్షన్ కింద డబ్బులు వస్తున్నాయి. అయితే అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు సదరు మహిళకు వీఆర్ఏ ఉద్యోగం రావడంలో సహాయం చేశాడు.
ఇక అప్పటి నుంచి ఆమెకు మాయమాటలు చెప్పి అందినకాడికి డబ్బులు లాక్కుంటున్నాడు. అతను డబ్బులు తీసుకుంటున్నాడన్న విషయాన్ని చుట్టుపక్కల వారు గమనించి ఆమెకు అర్థమయ్యేలా చెప్పడంతో మోసాపోయానని గమనించిన ఆమె.. పోలీసులను ఆశ్రయించింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి తహసీల్దారు కార్యాలయంలో VRO గా పనిచేసిన చెన్నారపు సత్యనారాయణ.. సర్వీస్ లో ఉండగానే 2019లో మృతి చెందారు. ఆయన భార్య మల్లేశ్వరికి.. జగ్గయ్యపేటకు చెందిన వైసీపీ సోషల్ మీడియా సమన్వయ కర్తఎర్రంశెట్టి ఆంజనేయులు.. VRA ఉద్యోగం రావడంలో సాయం చేశాడు.
అయితే, భర్త చనిపోవడంతో ప్రభుత్వం నుంచి 10 లక్షల రూపాయలు పరిహారం వస్తే.. కేవలం లక్ష రూపాయలే వచ్చాయని ఆంజనేయులు , సదరు మహిళను నమ్మించి మిగతా సొమ్మును నొక్కేశాడు.అంతే కాక, మల్లేశ్వరి భర్త పెన్షన్ తోపాటు ఆమె జీతాన్ని ష్యూరిటీగా పెట్టి.. బ్యాంకులో రుణం తీసుకున్నాడు. మల్లేశ్వరికి నెలకు 18 వేలు జీతం వస్తుండగా.. 6 వేలే వస్తున్నాయంటూ ATM కార్డు తీసుకుని డబ్బులు డ్రా చేసుకుంటున్నాడు. మల్లీశ్వరికి సంతానం లేకపోవడాన్ని అదునుగా చేసుకుని.. తన మేనల్లుడిని ఆమె దత్తత తీసుకున్నట్లుగా తంతు నడిపించాడు.
ఆమె చనిపోయిన తర్వాత ఆ ఇంటిని తన మేనల్లుడికి దక్కేలా పత్రాలు సృష్టించాడు. ఇలా దఫదఫాలుగా 30 లక్షల రూపాయలకు పైగా మోసం చేశాడు\" అని పోలీసులు తెలిపారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.ఎర్రంశెట్టి ఆంజనేయులు అనే జగ్గయ్యపేటకు చెందిన వ్యక్తి. అతను ఆ మహిళకు రావాల్సిలన బెనిఫిట్స్, ఉద్యోగం అన్ని ఇప్పిస్తా అని చెప్పి ఆమె దగ్గర ఏటీఎం కార్డు తీసుకున్నాడు.
సుమారుగా ఆ మహిళ దగ్గర ఉన్న 30 లక్షల రూపాయలను విడతల వారీగా తీసుకున్నాడు. ఆమెకు వీఆర్ఏ జాబ్ వచ్చిన తర్వాత.. ఆమె జాబ్ని, ఆమె భర్త పెన్షన్ని బ్యాంకులో పెట్టి 10లక్షల రూపాయలు తీసుకుని.. ఒక లక్ష ఆమెకి ఇచ్చి మిగతా డబ్బులను అతనే వాడుకున్నాడు. ఆమెకు పిల్లలు లేని కారణంగా ఆమె ఉంటున్న ఇల్లును తదనంతరం అతని మేనల్లుడికి చెందేటట్లుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. వీటన్నింటిని పరిశీలించి అతనిపై కేసు నమోదు చేశాం.
-జగ్గయ్యపేట పోలీసు
జరిగిన మోసం గురించి ఆంజనేయులును ప్రశ్నించగా ఇంట్లో ఉన్న ఆస్తి కాగితాలు దౌర్జన్యంగా తీసుకుపోయాడని బాధితురాలు తెలిపింది. ఎర్రంశెట్టి ఆంజనేయులు చేసిన మోసం విషయం తెలియడంతో రెండు నెలల క్రితమే వైసీపీ నుంచి బహిష్కరించారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Vijayawada, Ysrcp