హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Turipati By Election Results 2021: తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ గెలుపు.. 2019 రికార్డ్ బ్రేక్

Turipati By Election Results 2021: తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ గెలుపు.. 2019 రికార్డ్ బ్రేక్

భారీ విజయం దిశగా వైసీపీ అభ్యర్థి గురుమూర్తి

భారీ విజయం దిశగా వైసీపీ అభ్యర్థి గురుమూర్తి

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో (Tirupati By Election) వైసీపీ (YSRCP) విజయం సాధించింది. గతంలో కంటే అధికంగా మెజారిటీ సాధించింది.

తిరుపతి ఉపఎన్నికలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమైంది. ఆ పార్టీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి మ్యాజిక్ ఫిగర్ చేరుకున్నారు. ఇప్పటికే గురుమూర్తి ఆధిక్యం 2లక్షల 30వేలు దాటింది. ఇంకా లెక్కించాల్సిన ఓట్లు కేవలం లక్షా 70వేల ఓట్లు మాత్రమే ఉన్నాయి. మెజారిటీ విషయంలోనూ వైసీపీ దూసుకుపోతోంది. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి భారీ మెజారిటీ దిశగా దూసుకుపోతున్నారు. గతంలో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ ఓట్లను గురుమూర్తి సొంతం చేసుకుంటున్నారు. 2019లో దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ సాదించిన 2లక్షల 28వేల 376 ఓట్ల మెజారిటీ ఆయన అధిగమించారు. ఇప్పటికే గురుమూర్తికి ఏకంగా 5.33 లక్షల ఓట్లు పోలయ్యాయి. పనబాక లక్ష్మికి దాదాపు 3 లక్షలు రాగా.. బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు 50వేల ఓట్లు దక్కాయి. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ దూసుకుపోతోంది. గతంలో కంటే ఎక్కువ మెజారిటీ రావాలని వైసీపీ భావించినట్లే.. గురుమూర్తి మెజారిటీని క్రాస్ చేశారు.

తిరుపతి అర్బన్ తో పాటు శ్రీకాళహస్తి, సత్యవేడు, నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో వైసీపీ హవా చాటింది. ఈ స్థాయిలో మెజారిటీ రావడంపై గురుమూర్తి హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలన, సీఎం వైఎస్ జగన్ ఛరిష్మా రెండు కళ్లుగా ఈ గెలుపుకు దోహదపడ్డాయని ఆయన అన్నారు. ప్రజలంతా వైసీపీ వైపే ఉన్నారని.. ప్రజల్లో ఇతర పార్టీల పరిస్థితి ఏంటనేది వారికొచ్చిన ఓట్లను బట్టే తెలుస్తోందన్నారు.

First published:

Tags: Andhra Pradesh, Tirupati Loksabha by-poll, Ysrcp

ఉత్తమ కథలు