ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన తిరుపతి ఉపఎన్నిక ఫలితం (Tirupati By Poll Results) మరికొన్నిగంటల్లో తేలనుంది. అనూహ్యంగా వచ్చిన ఉపఎన్నికలో గెలిచి పట్టునిలుపుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్, ఉనికి చాటుకునేందుకు టీడీపీ, బీజేపీలు పొటిపడ్డాయి. ఆసక్తికి రేకెత్తించిన తిరుపతి బై పోల్ ఎన్నికలో గెలుపెవరిది? ఎవరి ఓటు శాతం ఎంత? ప్రస్తుతం ఈ ఫలితం కోసం ఏపీ వ్యాప్తంగా చాలామంది చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదైలన ఎగ్జిట్ పోల్స్ విజయంపై ఓ అంచనాకి వచ్చేలా చేశాయి. ఇక రావాల్సింది అసలు ఫలితమే. తిరుపతిలో గెలుపు ఎవరిది? ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి.. అధికార పార్టీ అంచనాలు నిజమవుతున్నాయా? ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఉనికిని చాటుకుందా?. ఏపీలో బోణీ కొట్టాలి అని చూసిన బీజేపీకి బలం పెరిగిందా? జనసేనాని ప్రచారం బీజేపీకి ఎంత వరకు కలిసి వచ్చింది అన్ని విషయాలను అంచనా వేసింది ఆరా సంస్థ. ఎవరికి ఎన్ని ఓట్లు పడే అవకాశం ఉందో అంటూ అంచనాలను చెప్పింది.
తీవ్ర ఉద్రిక్తతల మధ్య జరిగిన తిరుపతి ఉప ఎన్నికలో అధికార వైసీపీ భారీ విజయం సాధిస్తున్నట్టు ఆరా సంస్థ ప్రకటించింది. అందరూ ఊహించినట్టే.. మంత్రులు చెబుతున్న లెక్కలు కూడా నిజమవుతాయని ఆరా సంస్థ చెప్పింది. ఆ సంస్థ అంచనా ప్రకారం. వైసీపీకి 65.85 శాతం ఓట్లు దక్కించుకుందని అంచనా వేసింది. అంటే మంత్రులు చెబుతున్నట్టు భారీ మెజార్టీతో వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తి విజయం ఖాయమని జోస్యం చెప్పింది.
ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో వరుస ఓటములతో డీలా పడ్డ టీడీపీకి మరో షాక్ తప్పదని ఆ సంస్థ తేల్చేసింది. గట్టి పోటీ ఇస్తుందని అంతా అచంనా వేసిని ప్రధాన ప్రతిపక్షానికి కేవలం 23.10 శాతం ఓట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని చెప్పింది. అయితే ఈ ఎన్నికల ఫలితాలపై టీడీపీ మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అధికార వైసీపీ నేతలు భారీగా దొంగ ఓట్లు వేయించారని.. తిరుపతి అసెంబ్లీ పరిధి వరకు మళ్లీ ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల అధికారులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.
తిరుపతి ఉప ఎన్నికపై కమలం పార్టీ భారీగానే ఆశలు పెట్టుకుంది. తెలంగాణలో దుబ్బాక స్ఫూర్తితో తిరుపతిలో గెలుపొంది ఏపీలో అడుగు పెట్టాలని బీజేపీ ఆశించింది. ముఖ్యంగా జనసేనతో పొత్తు, యువత, సామాజిక సమీకరణాలు బాగా కలిసి వస్తాయని అంచనా వేస్తోంది. కనీసం గెలవకపోయినా సెకెండ్ ప్లేస్ అయితే తమదే అని స్థానికంగా లీడర్లు చర్చించుకున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రచారం కలిసి వస్తుందని ఆశించింది. కానీ తిరుపతి ఓటర్లు మాత్రం బీజేపీ ఊహించని షాక్ ఇచ్చారని ఆరా సంస్థ అంచనా వేసింది. ఆ పార్టీకి కేవలం కేవలం 7.34 శాతం ఓట్లే వస్తున్నట్టు చెప్పింది. ఇక కాంగ్రెస్ సహా ఇతర పార్టీలకు 3.71 శాతం ఓట్లు వచ్చినట్లు చెప్పింది. మరి ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమవతాయా..? లేక ఏమైనా అనూహ్యంగా అంచనాలు తలకిందులవుతాయా అనేది మరికొద్దిసేపట్లో తేలనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.