Tirumala: అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు కొలవైయున్న పవిత్ర క్షేత్రం తిరుమల (Tirumala Temple). శ్రీవారి దివ్యమంగళ స్వరూపాన్ని ఒక్కసారైనా దర్శిస్తే (Tirumala Sri Vari Darshan) అంతా మంచే జరుగుతుందని భక్తుల (Devotees) నమ్మకం. అందుకే నిత్యం వేలాది మంది ఆ సప్తగిరీశుడ్ని దర్శించుకొని తరిస్తుంటారు. కోర్కెలు తీర్చే వెంకన్న స్వామికి భక్తులు వివిధ రూపాల్లో మొక్కుల చెల్లించుకుంటూ ఉంటారు. భక్తులు నగదుతో పాటు బంగారం, వెండి ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు స్వామివారికి సమర్పిస్తుంటారు. అంతేకాకుండా స్వామివారికి కోట్ల విలువైన భూములు కూడా సమర్పించి తమ భక్తిని చాటుకుంటారు. దేశం నలువైపులా నుండి తిరుమలకు విచ్చేసే భక్తులు వివిధ రూపాల్లో వారి వారి స్థోమత తగ్గట్టుగా కానుకలను సమర్పిస్తుంటారు. భక్తుల సమర్పించిన కానుకలను అత్యంత భధ్రత నడుమ వాటిని లెక్కించి భధ్రత పరుస్తుంది టీటీడీ (TTD. దీంతో తిరుమలలో సరికొత్త రికార్డుల దిశగా శ్రీవారి హుండీ ఆదాయం సాగుతోంది.
తిరుమల శ్రీవారి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరుసగా తొమ్మిది నెలల పాటు రికార్డు స్థాయిలో.. 100 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. దీంతోఈ వార్షిక ఏడాదిలో ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయలు హుండీ ఆదాయాన్ని టీటీడీ అంచనా వేసింది. కేవలం 8నెలల కాలంలో శ్రీవారి హుండీ ఆదాయం 1161.74 కోట్లు నమోదైంది. 8 నెలలుగా ప్రతి నెలా తిరుమల వెంకటేశుడి హుండీ ఆదాయం 100 కోట్ల మార్క్ దాటుతోంది. తాజాగా వరుసగా 9వ నెల కూడా రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం 100 కోట్ల మార్క్ దాటడం సరికొత్త రికార్డ్..
నవంబరు నెలలో శ్రీవారి హుండీ ఆదాయం 127.3 కోట్లుగా నమోదైనట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. దీంతో ఈ వార్షిక సంవత్సరంలో హుండీ ఆదాయం 1600 కోట్లు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత 9 నెలల కాలంలో అత్యధికంగా జూలై నెలలో 139.35 కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చింది. భక్తుల సంఖ్య ప్రతి రోజూ 70 వేలకు పైగా ఉండటం, నాలుగు కోట్ల రూపాయల హుండీ ఆదాయం ప్రతి రోజూ లభిస్తుండటంతో ఈ స్థాయిలో హుండీ ఆదాయం సాధ్యమవుతోంది.
ఇప్పటి వరకు 2019-20 వార్షిక సంవత్సరంలో లభించిన 1,313 కోట్ల రూపాయలే అత్యధిక హుండీ ఆదాయంగా ఉంది. ఇదే ఏడాది జూలై 4న శ్రీవారికి ఒక్కరోజులో అత్యధికంగా 6.14 కోట్ల హుండీ ఆదాయాన్ని భక్తులు సమర్పించారు. అయితే కరోనా తర్వాత భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న మొక్కులను ఒకేసారి తీర్చుకుంటున్నారు. అందుకే ఆదాయం నెలకు వంద కోట్లకు పైగానే వస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అటు భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని తిరుమలలో వసతులు, అన్నదానం వంటి సౌకర్యాలను కూడా పెంచారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Tirumala Temple, Tirumala tirupati devasthanam