తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేలాది భక్తులు పోటెత్తుతుంటారు. స్వామి వారి దర్శనం కోసం పడిగాపులు కాస్తుంటారు. అయితే ఈ నెల (మార్చి) 27న తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్లైన్లో ఉంచనున్నట్లు టీటీడీ తెలిపింది. ఏప్రిల్ నెలకు సంబంధించిన రూ.300 టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచనుంది. ఈ మేరకు భక్తులు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది.
ఉదయం 11 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటాయని ప్రకటన విడుదల చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది. తిరుమల శ్రీవారి రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలంటే ముందుగా టీటీడీ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాలి. అనంతరం స్పెషల్ ఎంట్రీ దర్శన్ (ప్రత్యేక దర్శనం) ఆప్షన్ను సెలక్ట్ చేసుకోవాలి. అక్కడ మొబైల్ నంబర్ను ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ (OTP)పై నొక్కాలి.12-Feb-2023
మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది టీటీడీ. భక్తుల కోరిక మేరకు వర్చువల్ సేవా టికెట్స్ ఆన్ లైన్ సేవలు కొనసాగించాలని నిర్ణయించింది. వేసవి కాలం మూడు నెలలపాటు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. వీఐపీ రెఫరల్స్ తగ్గించే అవకాశం ఉంది. శ్రీవాణి టికెట్ల సంఖ్య కూడా తగ్గిస్తామని సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తూ వారికి దర్శనం కల్పిస్తామని టీటీడీ చెబుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Tirumala news, Tirumala Temple, Tirumala tirupati devasthanam