Pawan Kalyan : అసలే ఏపీలో ఓ రాజకీయ పుకారు కలకలం రేపుతోంది. ఏంటంటే... చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఒక్కటయ్యాయనీ, ఆ మూడూ కలిసి... ఏపీలో అధికారం చేపట్టేందుకు వైసీపీని గద్దె దించేందుకు ప్రయత్నిస్తున్నాయని. అందుకు బలం చేకూరుస్తున్నట్లుగా... ఒకే అంశంపై ఒకే సమయంలో... అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ ట్వీట్ చెయ్యడం ఆసక్తి రేపుతోంది. ఇది కాకతాళీయకంగా జరిగిందే అనుకున్నా... ఇప్పుడే ఇద్దరూ ఇలా స్పందించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఏంటంటే... విజయనగరంలో గాంధీజీ విగ్రహానికి వైసీపీ శ్రేణులు... తమ పార్టీ జెండా రంగులు వేసుకున్న విషయాన్ని చంద్రబాబు ట్వీట్ రూపంలో ప్రశ్నించారు. అదే విషయంపై పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ చేశారు.
వైసీపీ రంగులతో మొన్న జాతీయ జెండా , ఈ రోజు గాంధీజీ,రేపు ఎవరు
శ్రీ జగన్ రెడ్డి జీ ???
(This happened in Hon.Min Sri Bothsa Sathyanarayana ji’s Vijayanagaram district,A.P) pic.twitter.com/jlyQbYYuT7
— Pawan Kalyan (@PawanKalyan) November 22, 2019
Not learning lessons after drawing flak for disrespecting the national tricolor, @ysjagan’s Govt is back to showing its true colours. In Vizianagaram Dist, the pedestal of Gandhiji’s statue has been painted in party colours again. Why this arrogance? #YSRCPDisrespectsMahatma pic.twitter.com/OClCZIkXYv
— N Chandrababu Naidu (@ncbn) November 22, 2019
ఇద్దరూ ఒకే అంశంపై, ఒకే సమయంలో ఒకే రకమైన ట్వీట్ చెయ్యడం ఏపీ రాజకీయాల్లో చర్చకు తెరతీసినట్లైంది. ప్రతిపక్షాలన్నాక... ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు వేర్వేరు అంశాలపై ఒకే రకమైన పోరాటాలు చెయ్యడం సహజం. ఐతే... ఈ రంగులు వేసే కార్యక్రమం మూడు నెలలుగా సాగుతున్నా... ఇప్పుడే అటు టీడీపీ, ఇటు జనసేన అధినేతలు స్పందించడం కాకతాళీయకంగా జరిగిందా అన్న చర్చ సాగుతోంది.
ఏది ఏమైనా వైసీపీ ఇలా ప్రభుత్వానికి సంబంధించి కార్యాలయాలు, జాతీయ చిహ్నాలు, మహా నేతల విగ్రహాలకు సొంత పార్టీ రంగులు వేసుకుంటున్న విషయం మాత్రం విమర్శలకు దారితీస్తోంది. అధికారంలో ఉన్నంత మాత్రాన ఆ పార్టీ ఏం చేసినా చెల్లుతుందనుకోవడం కరెక్టు కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Pics : ఫ్యాషన్కి కొత్త అర్థం చెబుతున్న రెహనా బషీర్
ఇవి కూడా చదవండి :
మానవత్వం చచ్చిపోలేదు... రష్మీ గౌతమ్ రీట్వీట్
Health : గుమ్మడికాయ గింజలతో 7 ఆరోగ్య ప్రయోజనాలు
Health Tips : బంగాళాదుంపల్ని ఇలా వండితే మేలు
Health : కూరగాయలు పచ్చివి తింటే ప్రమాదమా... ఆయుర్వేదం ఏం చెబుతోంది?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP News, Chandrababu naidu, Janasena party, Pawan kalyan, Telugu news, Telugu varthalu