హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

పిల్లల్ని బడికి పంపితే... వైసీపీ ఇస్తానన్నది రూ.15,000... టీడీపీ ఇస్తానంటున్నది రూ.18,000

పిల్లల్ని బడికి పంపితే... వైసీపీ ఇస్తానన్నది రూ.15,000... టీడీపీ ఇస్తానంటున్నది రూ.18,000

టీడీపీ మేనిఫెస్టోతో చంద్రబాబు, వైసీపీ మేనిఫెస్టోతో జగన్

టీడీపీ మేనిఫెస్టోతో చంద్రబాబు, వైసీపీ మేనిఫెస్టోతో జగన్

AP Assembly Election 2019 : ఎన్నికల సమయంలో ఆచరణ సాధ్యమా కాదా అన్నదానితో సంబంధం లేకుండా పార్టీలు... పోటీపడి మరీ హామీలిస్తున్నాయి.

పిల్లలను బడికి పంపితే అమ్మఒడి పథకం కింద ఆ తల్లికి ఏడాదికి రూ.15,000 ఇస్తామని మొదటి నుంచీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెబుతూనే ఉన్నారు. తాజాగా ఈ హామీని మేనిఫెస్టోలో కూడా చేర్చారు. ప్రతి స్కూల్లో ఇంగ్లీష్‌ మీడియం, తెలుగు సబ్జెక్టు తప్పనిసరి చేయడం, పుస్తకాలు, యునిఫారం సకాలంలో అందజేయడం, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు ప్రతి విద్యార్థికి ఏటా రూ.20వేలు, అవసరమైన మేరకు టీచర్ల ఉద్యోగాలు పూర్తిస్థాయిలో భర్తీ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల్లో ఫీజులు తగ్గింపు, గిరిజనులకు ప్రత్యేక యూనివర్సిటీ, రాజధానిని ఫ్రీజోన్‌గా గుర్తిస్తూ నిజమైన వికేంద్రీకరణే లక్ష్యంగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో సమగ్రంగా అభివృద్ధి సాధిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు జగన్.

జగన్ ప్రకటించిన ఈ అమ్మ ఒడి పథకానికి ఏపీలో మంచి రెన్సాన్స్ వస్తున్నట్లు తెలిసింది. ఇప్పటివరకూ చాలా మంది పేద తల్లులు... కుటుంబ పోషణ కోసం తమతోపాటూ పిల్లల్ని కూడా పనులకు పంపిస్తున్నారు. తద్వారా పిల్లలు తలో వెయ్యి రూపాయలూ సంపాదిస్తే, కుటుంబ పోషణకు వీలవుతుందని అలా చేస్తున్నారు. వైసీపీ ఇచ్చిన హామీ వల్ల బాల కార్మిక వ్యవస్థకు కొంతవరకూ చెక్ పెట్టినట్లవుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లల్ని స్కూళ్లకు పంపి... వైసీపీ ప్రభుత్వం ఇచ్చే రూ.15,000తో కుటుంబాన్ని పోషించుకునే ఛాన్స్ ఉంటుంది. ఇది చక్కటి పథకం కావడంతో... ఇలాంటిదే ఓ పథకాన్ని ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.

తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో మహిళల సంక్షేమానికి రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెడతామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. బిడ్డను బడికి పంపే ప్రతీ అమ్మకు ఏడాదికి రూ.18,000 ఇస్తామని చెప్పారు. అంటే... వైసీపీ ఇస్తామన్న దానికంటే... చంద్రబాబు మరో రూ.3,000 అదనంగా ఇస్తామన్నట్లు లెక్క.

వైసీపీ హామీ ప్రకారమైతే... ఒక పాప లేదా బాబును స్కూలుకు పంపితే... ఆ తల్లికి నెలకు రూ.1250 వస్తుంది. అదే టీడీపీ హామీ ప్రకారమైతే ఒక పాప లేదా బాబును స్కూలుకు పంపితే... ఆ తల్లికి నెలకు రూ.1500 వస్తుంది.

చంద్రబాబు ఈ స్కీమును ఇప్పుడే ప్రకటించినట్లు తెలుస్తోంది. వైసీపీ హామీకి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో... అదే తరహా స్కీమును... మరింత ఎక్కువ మొత్తంతో హామీగా ఇస్తే... ప్రజల మద్దతు తమకే ఉంటుందని టీడీపీ భావిస్తున్నట్లు తెలిసింది.


ఇవి కూడా చదవండి :

నా భర్తే తన ఫ్రెండ్స్‌తో పడుకోమన్నాడు... ఓ భార్య వ్యథ...

పోలవరం నిజం.. ఎవరు పూర్తిచేస్తే వారికే ఓటేయండి: హీరో శివాజీ

మేనిఫెస్టోల పండగ ముగిసింది... ఇక పోల్ స్ట్రాటజీపై దృష్టిపెడుతున్న పార్టీలు... ఎలాగంటే...

ప్రచారానికి మిగిలింది మూడు రోజులే... బయటికొస్తున్న నోట్ల కట్టలు... ఎలక్షన్స్ ఫీవర్‌లో పార్టీలు నేతలు

First published:

Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Chandrababu Naidu, TDP, Ys jagan, Ysrcp

ఉత్తమ కథలు