హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

తిరుమల శ్రీవారి లడ్డుల అమ్మకం ప్రారంభం.. బారులుదీరిన భక్తులు

తిరుమల శ్రీవారి లడ్డుల అమ్మకం ప్రారంభం.. బారులుదీరిన భక్తులు

ఆన్‌లైన్ సేవలో పాల్గొనే భక్తులకు లడ్డు ప్రసాదం, అక్షింతలు, పట్టువస్త్రాన్ని పోస్టల్ ద్వారా పంపనున్నారు.

ఆన్‌లైన్ సేవలో పాల్గొనే భక్తులకు లడ్డు ప్రసాదం, అక్షింతలు, పట్టువస్త్రాన్ని పోస్టల్ ద్వారా పంపనున్నారు.

తిరుపతిలోని ప్రధాన పరిపాలన భవనం వద్ద లడ్డూ ప్రసాదాలు మొదలయ్యాయి. దాదాపు 55 రోజుల తర్వాత లడ్డూ విక్రయాలు మొదలుకావడంతో విషయం తెలుసుకున్న భక్తులు బారులుదీరారు.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనంతో పాటు లడ్డూల అమ్మకాలను టీటీడీ నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో శ్రీవారి లడ్డూ ప్రసాదంతో స్వామివారి దర్శనం దొరక్క భక్తజనం అల్లాడిపోయారు. లాక్‌డౌన్ నిబంధనలకు సడలింపులు ఇవ్వడంతో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి లడ్డూ ప్రసాద విక్రయాలను శనివారం ఉదయం నుంచి ప్రారంభించింది. తిరుపతిలోని ప్రధాన పరిపాలన భవనం వద్ద లడ్డూ ప్రసాదాలు మొదలయ్యాయి. దాదాపు 55 రోజుల తర్వాత లడ్డూ విక్రయాలు మొదలుకావడంతో విషయం తెలుసుకున్న భక్తులు బారులుదీరారు. కరోనా విజృంభణతో శ్రీవారి దర్శనాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. స్వామి వారి నిత్య కైంకర్యాలను మాత్రం అర్చకులు నిర్వహిస్తున్నారు. సామాజిక దూరం నిబంధనలను పాటిస్తూ పరిమిత సంఖ్యలో త్వరలో భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించాలని ఆలయ అధికారులు భావిస్తున్నారు.

First published:

Tags: Tirumala Temple, Tirupati, Ttd

ఉత్తమ కథలు