విశాఖ గ్యాస్ లీకేజీ బాధితులకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో ఇప్పటికే అవకాశం కల్పించామని మంత్రి కన్నబాబు తెలిపారు. అన్యాయం జరిగిందనే భావన బాధితుల్లో కొందరు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.
విశాఖ గ్యాస్ లీకేజీ బాధితులు కేజీహెచ్లో ఎన్ని రోజులైనా ఉండవచ్చని ఏపీ మంత్రి కన్నబాబు తెలిపారు. వారిని నాణ్యమైన చికిత్స అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. కెమికల్ ప్రభావిత గ్రామ ప్రజలకు ప్రత్యేక హెల్త్ కార్డులు ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. బాధిత గ్రామాల ప్రజలు రాబోయే ఏడాది పాటు వైద్య సేవలు కోరుకుంటున్నారన్న మంత్రి కన్నబాబు... వారికి హెల్త్ కార్డ్ ఇచ్చే ప్రక్రియను కూడా చేపడుతున్నామని తెలిపారు. పాలిమర్ బాధితులకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో ఇప్పటికే అవకాశం కల్పించామన్నారు. అన్యాయం జరిగిందనే భావన బాధితుల్లో కొందరు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.
బాధితులకు ఎలాంటి అన్యాయం చేయడం లేదని మంత్రి స్పష్టం చేశారు.ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీలో ప్రమాదానికి గురైన స్టైరిన్ ట్యాంక్ వద్ద మాత్రమే కొంత ప్రభావం ఉందని మంత్రి కన్నబాబు తెలిపారు. మెడికల్ నిపుణుల కమిటీని 10 మంది వైద్యులతో ఏర్పాటు చేశామని వివరించారు. స్టైరిన్పై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని సీఎం జగన్ ఆదేశించారని, అన్ని గ్రామాల్లో నెల రోజుల పాటు మెడికల్ క్యాంప్ ఉంటుందని స్పష్టం చేశారు. శాశ్వతంగా వైఎస్సార్ క్లీనిక్ను వెంకటాపురంలో ఏర్పాటు చేస్తామని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన దీనిని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.