Shocking: కొబ్బరి చెట్టు ఎక్కి బొండాలు కొడుతుండగా.. అందులో కొన్ని పక్కనే ఉన్న బావిలో పడ్డాయి.. అయితే వాటిని తీసేందుకు.. బావిలో దిగి చూడగా వారికి ఊహించని షాక్ తగిలింది.. ఇంతకీ ఆ బావిలో ఏం ఉందో తెలుసా..?
Snake Well in East Godavari: అప్పుడప్పుడూ ఊహించని ఘటనలు షాకిస్తాయి. ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది.. అలాంటి ఘటన ఒకటి ఆంధ్రప్రదేశ్ లోని.. తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది.. కొబ్బరి బొండాల కోసం బావిలోకి దిగితే ఊహించనవి కనిపించి అంతా షాక్ తిన్నారు.. అంతే కాదు పెను ప్రమాదం తప్పింది కూడా.. ఇప్పటికే వారు ఆ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నారు. లక్కీగా ప్రాణాల నుంచి బయట పడ్డాం ఏ దేవుడో కాపాడాడు అని దేవుడికి దండాలు పెట్టుకుంటున్నారు. కొబ్బరి కాయలు కొన్ని వదిలేసినా పోయేది.. వాటి కోసం ప్రాణాలపై తెచ్చుకునే వాళ్లమంటూ నిట్టూర్చారు. ఆ ఘటన గురించి విన్న వాళ్లు కూడా అమ్మో అని నోరెళ్లబెట్టాల్సి వస్తోంది. ప్రతి ఏడాదిలానే ఈ సారి అక్కడ కొబ్బరి పంట బాగా రావడంతో.. వాటిని కిందకు దించి కొబ్బరి కాయల్లా మార్చి విక్రయించాలని ఓ కొబ్బరి రైతు సిద్దమయ్యాడు.వెంటనే కొబ్బరి చెట్టుపైకి ఎక్కి.. అక్కడ ఉన్న కొబ్బరి బొండాలను ఒక్కొక్కటిగా కిందకు దించుతున్నాడు. అదే సమయంలో కొన్ని కొబ్బరి బొండాలు అనుకోకుండా.. పక్కనే ఉన్న పాడుపడ్డ బావిలో పడిపోయాయి.. అయితే ప్రతి ఏడాది అలానే జరుగుతుంటూ ఉంటాయి. అలా పడిపోయిన కొబ్బరి బొండాలను బావిలోకి దిగి తీస్తూ ఉంటారు.. అదే అలావాటులో బావిలోకి దిగితే ఈ సారి ఊహించని షాక్ తగిలింది.. ఇంతకీ ఏం జరిగిందంటే..
కింద పడిపోయిన బొండాలను వదిలేస్తే కొంత నష్టం వస్తుందని.. అయినా కష్టపడి కొట్టిన బొండాలను అలా వదిలిస్తే ఎలా అంటూ.. వాటిని తీసేందుకు బావిలోకి దిగాడు. కొన్ని బొండాలు తీస్తుండగా ఏదో శబ్దాలు భయపెట్టాయి. ఏంటి ఆ శబ్ధం అని చూస్తుండగా..5 అడుగుల అత్యంత విషపూరితమైన రక్త పింజరి బయటపడింది. బుసలు కొడుతున్న పామును చూసి కొబ్బరి రైతులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. భయంతో తోట నుంచి బయటకు పరుగులు తీశారు. వెంటనే స్నేక్ క్యాచర్ వర్మకు సమాచారం అందించారు స్థానికులు.
వెంటనే అక్కడకు చేరుకున్న వర్మ సర్పాన్ని చాకచక్యంగా బంధించాడు. అది గర్భంతో ఉన్నట్లుగా గుర్తించారు. పాము పొట్టలో 60 నుండి 100 పిల్లలు ఉండి ఉంటాయని స్నేక్ క్యాచర్ వర్మ తెలిపారు. ఆపై నిర్మానుష్య ప్రదేశంలో పామును వదిలిపెట్టారు. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే.. ప్రస్తుతం అక్కడ రక్తపింజరాలు హడలెత్తిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పొదలు, పుట్టలు కొట్టుకు పోవటంతో పాములు జనావాసాల్లోకి వచ్చి చేరుతున్నాయి. ఈ క్రమంలోనే కొబ్బరి కాయలు దింపుతున్న రైతుకు పెద్ద ప్రమాదం తప్పింది.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.