హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Bus Accident : ఆర్టీసీ బస్సు బోల్తా.. కొంపముంచిన డ్రైవర్ నిద్ర మత్తు

Bus Accident : ఆర్టీసీ బస్సు బోల్తా.. కొంపముంచిన డ్రైవర్ నిద్ర మత్తు

ఆర్టీసీ బస్సు బోల్తా

ఆర్టీసీ బస్సు బోల్తా

Bus Accident : డ్రైవింగ్ చేసేవారు.. బాగా నిద్రపోవాలి. సరిగా నిద్రపోకుండా డ్రైవింగ్ చేస్తే.. ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలుస్తాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

కాకినాడ తుని జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఆ బస్సు విజయవాడ నుంచి పార్వతీపురం వెళ్తోంది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. వారిలో కొందరికి గాయాలైనట్లు సమాచారం.

అసలు ఈ బస్సు ప్రమాదం జరగడానికి కారణం డ్రైవరే అని తెలిసింది. నిద్ర మత్తులో బస్సు నడిపిన డ్రైవర్.. వేగంగా నడుపుతూ.. డివైడర్‌ని ఢీకొట్టడంతో.. ఒక్కసారిగా బస్సు.. అదుపు తప్పి.. బోల్తాకొట్టి.. రోడ్డుపైనే పడింది. ఆ సమయంలో ప్రయాణికులు కూడా నిద్రమత్తులో ఉన్నారని తెలిసింది.

జనరల్‌గా ఆర్టీసీ బస్సు డ్రైవర్లు బాగానే నిద్రపోతారు. అందువల్ల డ్రైవింగ్ చేసే సమయంలో వారికి నిద్ర రాదు. కానీ ఈ డ్రైవర్‌‌కి నిద్ర రావడానికి కారణం.. వాతావరణంలో వచ్చిన మార్పే అని తెలుస్తోంది. చల్లటి వాతావరణం కారణంగా... డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్నట్లు తెలుస్తోంది.

First published:

Tags: Andhra Pradesh, AP News, Road accident

ఉత్తమ కథలు