హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ప్లాట్ ఫాం టికెట్ రూ.30.... ఈ మూడు రైల్వే స్టేషన్లలో

ప్లాట్ ఫాం టికెట్ రూ.30.... ఈ మూడు రైల్వే స్టేషన్లలో

ప్రతీకాత్మక చిత్రం (పండుగవేళ రద్దీ)

ప్రతీకాత్మక చిత్రం (పండుగవేళ రద్దీ)

ఈ రోజు నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు ప్లాట్ ఫాం టికెట్ ధర రూ.30 వసూలు చేస్తారు. అయితే, అది కేవలం మూడు స్టేషన్లలోనే ఉంటుంది.

దసరా సందర్భంగా ప్రయాణికులకు, వారిని సాగనంపడానికి వచ్చేవారికి రైల్వే శాఖ భారీ షాక్ ఇచ్చింది. ప్లాట్ ఫాం టికెట్ ధరను రూ.30 చేసింది. సాధారణంగా ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ ధర రూ.10 ఉంది. అయితే, ఈ రోజు నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు ప్లాట్ ఫాం టికెట్ ధర రూ.30 వసూలు చేస్తారు. అయితే, అది కేవలం మూడు స్టేషన్లలోనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి స్టేషన్లలో ఈ కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ అంతా ఇంతా ఉండదు. సొంతూళ్లకు వెళ్లాలనుకునే వారితో వాహనాలు క్రిక్కిరిసిపోతుంటాయి. రైళ్ల సంగతి చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో, దసరా రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే కొన్ని ముఖ్యమైన స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టికెట్ల ధరలు పెంచింది. అక్టోబర్ 10 తర్వాత మళ్లీ పాత రేట్లనే అమలు చేస్తారు.

First published:

Tags: Indian Railways, Nellore, Rajahmundry S01p08, South Central Railways, Vijayawada

ఉత్తమ కథలు