హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Great Judgment: ఏడాదిన్నర క్రితం 7ఏళ్ల బాలికపై అత్యాచారం అటుపై హత్య .. కామాంధుడికి సరైన శిక్ష వేసిన కోర్టు

Great Judgment: ఏడాదిన్నర క్రితం 7ఏళ్ల బాలికపై అత్యాచారం అటుపై హత్య .. కామాంధుడికి సరైన శిక్ష వేసిన కోర్టు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Great Judgment: ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసి ఆమె చావుకు కారణమైన మానవమృగానికి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. ఏడాదిన్నర క్రితం జరిగిన ఈ దారుణ సంఘటనలో దోషికి శిక్షతో పాటు బాధిత కుటుంబానికి పరిహారం అందజేయాలని తీర్పు వెల్లడించింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Ongole, India

ఆంధ్రప్రదేశ్‌(Andhra pradesh)ప్రకాశం (Prakasam) జిల్లాలో ఏడాదిన్నర క్రితం ఓ చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో జిల్లా కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ మానవమృగం ఏడేళ్ల బాలికపై తండ్రి వరసయ్యే వ్యక్తి అత్యాచారానికి పాల్పడి ఆమె చావుకు కారణమయ్యాడు. దారుణానికి పాల్పడిన నిందితుడికి కోర్టు ఉరిశిక్ష(Hanging)విధించింది. అంతే కాదు చిన్నారి తల్లిదండ్రులకు 10లక్షల పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏడాదిన్నర క్రితం సంచలనం సృష్టించిన కేసులో కోర్టు (Court)న్యాయమైన తీర్పు వెల్లడించడంతో మృతురాలి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

Shocking News: సెల్ఫీ సరదా ఎంత డేంజరో తెలుసా..? శివుడిగా పోజ్ ఇవ్వాలని శవమయ్యాడు ..

దోషికి ఉరిశిక్ష..

18నెలల క్రితం ప్రకాశం జిల్లాలో మైనర్ బాలిక అత్యాచారం, హత్య కేసులో ఒంగోలు రెండో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నేరం చేసిన నిందితుడికి మరణశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. జిల్లాలోని గిద్దలూరు మండలం అంబవారం గ్రామానికి చెందిన దూకేకుల సిద్దయ్య అనే వ్యక్తి 2021జులై నెలలో ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తన ఇంటి సమీపంలో ఆడుకుంటున్న చిన్నారిక మాటమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లాడు. గట్టిగా కేకలు వేయడంతో తాళ్లతో కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటన జరిగిన సమయంలో చిన్నారి ప్రాణాలు విడిచింది. వెంటనే చిన్నారి మృతదేహాన్ని ఓ ప్లాస్టిక్ కవర్‌లో ప్యాక్ చేసి గ్రామ శివార్లలోని చెత్తకుప్పలో పడేసి పారిపోయాడు నిందితుడు.

10లక్షల పరిహారం....

తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని పట్టుకొని అతనిపై హత్య, అత్యాచారంతో పాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి జైల్లో పెట్టారు. కేసు విచారణలో భాగంగా బుధవారం నిందితుడిని దోషిగా నిర్థారించింది కోర్టు. దారుణానికి పాల్పడిన నిందితుడికి మరణశిక్ష (ఉరివేయాలని) విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఈకేసులో మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం 10లక్షల రూపాయల పరిహారం అందజేయాలని సూచింది.

పోలీస్ సిబ్బందికి ప్రశంసలు..

రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన ఈకేసులో నిందితుడ్ని పట్టుకోవడం, అతని శిక్ష పడటంలో ప్రతిభ కనబర్చిన నాటి దిశ స్టేషన్ డీఎస్పీతో పాటు పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందిస్తూ రివార్డులు, ప్రశంసా పత్రాలను అందజేశారు.

First published:

Tags: Andhra pradesh news, Crime news, Ongole

ఉత్తమ కథలు