AP Government vs Tollywood: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వర్సెస్ టాలీవుడ్ (Tollywood) వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు. సినిమా టికెట్ల ధరలపై (AP Movie Tickets Issue) వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. ఏపీ ప్రభుత్వం (AP Government) తీసుకొచ్చిన చట్టసవరణతో అదనపు షోలు రద్దు కావడంతో పాటు టికెట్ ధరలు కూడా తగ్గించనున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) సినిమా టికెట్ల ధరలపై పునరాలోచించుకోవాలని శుక్రవారం ఏపీ ప్రభుత్వానికి, సీఎం జగన్ (CM YS Jagan) కు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. తాజాగా బడా ప్రొడ్యూసర్ సురేష్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం తీరును ఆయన తప్పు పట్టారు. ఆన్ లైన్ టిక్కెట్ విధానంపై ప్రభుత్వం పునరాలోచించాలి అని కోరారు. ప్రభుత్వం అలాగే ముందుకు వెళ్లే కనీసం థియేటర్ కు సంబంధించి కెరెంటు ఛార్జీలు కూడా రావన్నారు. అసలు ప్రస్తుతం పరిస్థితుల్లో ప్రజలు థియేటర్ కు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారని.. ఇలాంటి సమయంలో రేట్లు తగ్గిస్తే నిర్మాతలకు భారీ నష్టాలు తప్పవని.. అసలు సినిమా రిలీజ్ చేసే పరిస్థితే ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఏపీలో టికెట్ రేట్ల వ్యవహారం విషయంలో తాజాగా సురేష్ బాబు వ్యాఖ్యలు సంచలనమవుతున్నాయి. ఇప్పుడున్న టికెట్ రేట్లు అమలైతే, కరెంటు ఛార్జీలు కూడా రావని, ఇదే పరిస్థితి కొనసాగితే, థియేటర్లు మూసుకోవాల్సివస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్లో ఒకొక్క వస్తువుకీ ఒక్కో రేటు ఉంటుందనిప.. అలాంటప్పుడు అన్ని వస్తువుల్ని కలిపి ఒకే రేటుకి అమ్మాలంటే ఎలా కుదురుతుంది అన్నారు.? సినిమా కూడా అంతే. పెద్ద సినిమాల బడ్జెట్ వేరు. చిన్న సినిమాల బడ్జెట్ వేరు. రెండు సినిమాలకూ ఒకే రేటు నిర్ణయించడం సరైన నిర్ణయం కాదన్నారు. ఇలాగైతే భవిష్యత్తులో పెద్ద సినిమాలు భారీగా నష్టపోతాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి : మిషన్ 2024పై ఫోకస్.. చంద్రబాబు బస్సు యాత్ర.. చిన్నబాబు పాదయాత్రలతో భారీ వ్యూహం
ఏమైనా అంటే బ్లాక్ టికెట్ వ్యవస్థ అంటుంటారు. బ్లాక్ టికెట్ వ్యవస్థ.. రెండు మూడు రోజులు ఉంటుందేమో..? ఆ తరవాత.. టికెట్ మామూలు రేటుకే అమ్ముతారు. తిప్పి కొడితే.. వెయ్యి కోట్ల పరిశ్రమ కాదిది. దానిపై ఇన్ని ఆంక్షలేంటో అర్థం కావడం లేదన్నారు. టికెట్ రేటు ఇంత అని చెప్పలేం.. కానీ థియేటర్లో ప్రేక్షకుడ్ని బలవంతంగా కూర్చోబెట్టలేమన్నారు.
ఇష్టం లేకుండా టికెట్ కొనిపించలేమన్నారు. ఇష్టమొచ్చినవాళ్లు చూస్తారు, లేదంటే మానేస్తారు. అది కేవలం ప్రేక్షకుడి చేతుల్లో ఉంటుంది అన్నారు. మా సినిమా చూడమని ఎవరూ నిర్భందించలేరు కదా అని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ చిత్రసీమని చిన్నచూపు చూస్తుండడం దారుణమన్నారు. ఇలాగైతే మనుగడ సాధించడం కష్టమవుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు..
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap government, AP News, Suresh Babu, Tollywood