Crime News: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కామాంధుల అరాచకాలు రోజు రోజుకూ రెట్టింపు అవుతున్నాయి. ఆ అఘాత్యాలకు అడ్డుకట్ట వేయాలని ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా వారి కామదాహం తీరడం లేదు. దిశ (Disaha) వంటి చట్టాలు ఎన్నివచ్చినా.. కామాంధులు రెచ్చిపోతూనే వున్నారు. మహిళలు, పిల్లలపై, మైనర్ బాలికలపై దాడులు ఆగడం లేదు. తాజాగా నెల్లూరు (Nellore) లో దారుణ ఘటన జరిగింది. ముక్కు పచ్చలారని చిన్నారుల్ని సైతం వారు వదలడం లేదు. అఘాయిత్యాలకు పాల్పడడం, ఎదురతిరిగితే దాడులకు బరి తెగిస్తున్నారు. తాజాగా జరిగిన ఓ ఘటన మహిళలకు రక్షణ లేదనే టెన్షన్ పెంచుతోంది. నెల్లూరులో ఓ బాలిక ఇంట్లోకి చొరబడి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. అది కూడా అతి కిరాతకంగా..
బాలిక గొంతు కోసి.. యాసిడ్ దాడికి పాల్పడ్డాడా నిందితుడు. ఆ పై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ బాలిక ప్రతిఘటించడంతో కత్తితో దాడి చేశాడు. దీంతో బాలిక తీవ్రంగా గాయపడింది. బాలికపై యాసిడ్ పోసిన నిందితుడు నాగరాజును (Nagaraju) అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యాసిడ్ దాడికి గురైన బాలిక పరిస్థితి విషమంగా వుందని తెలుస్తోంది. బాలికకు చికిత్స అందుతున్నా.. ఆహారం తీసుకోవడం ఆమెకు కష్టంగా వుందని వైద్యులు చెబుతున్నారు. నెల్లూరులోని వెంకటాచలం మండలంలోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటన తీవ్రంగా కలకలం రేపుతోంది. బాధిత బాలిక ఓ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది.
ఇదీ చదవండి : కేంద్రీయ విద్యాలయంలో కలకలం.. ఊపిరాడక 30 మంది విద్యార్థులకు అస్వస్థత
అయితే బాలికను ఇంట్లోనే ఉంచి తల్లిదండ్రులు నిన్న సాయంత్రం బయటకు వెళ్లారు. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయాన్ని గుర్తించిన నాగరాజు అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. అతడి నుంచి తప్పించుకున్న బాలిక వాష్రూములోకి వెళ్లి తలుపులు మూసే ప్రయత్నం చేసింది. తలుపులు బలంగా నెట్టి లోపలికి వెళ్లిన నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయినా ఆమె ఆ మృగాడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఆమె అలా ప్రతిఘటించడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు నిందితుడు నాగరాజు. తన వెంట తెచ్చిన యాసిడ్ను ఆమె ముఖంపై, నోట్లోను పోశాడు. బాధతో బాలిక పెద్దగా కేకలు వేయడంతో గొంతు కోసి పరారయ్యాడు.
చుట్టుపక్కల వారు వచ్చి జరిగిన ఘాతుకాన్ని చూసి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వెంటనే తల్లిదండ్రులు, బంధువులు అక్కడికి చేరుకున్నారు. రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతున్న కుమార్తెను నెల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని గత రాత్రి నెల్లూరు ఎస్పీ సీహెచ్ విజయరావు, మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పరామర్శించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Crime news, Nellore