విశాఖ గ్యాస్ లీక్ ఘటన ఎంత్ర ప్రమాదానికి దారి తీసిందో అందరికీ తెలిసిందే. వందల మంది అనారోగ్యానికి గురవ్వగా, 12 మంది మృతిచెందారు. అయితే, ప్రమాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమను జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ నియమించిన కమిటీ ఛైర్మన్ జస్టిస్ శేషశయనరెడ్డి సందర్శించనున్నారు. గురువారమే విశాఖకు వచ్చిన ఆయన.. నేడు పరిశ్రమను పరిశీలించనున్నారు. ఈ కమిటీలో ముగ్గురు సభ్యుల బృందం మూడు రోజుల క్రితమే ఎల్జీ పాలిమర్స్ కంపెనీని సందర్శించి బాధిత గ్రామాల్లో పర్యటించింది. ఈ రోజు శేషశయనరెడ్డి కంపెనీని సందర్శించి ప్రమాద కారణాలపై విచారణ చేపట్టనున్నారు. అనంతరం బాధిత గ్రామాల్లో పర్యటించి అధికారులతో భేటీ కానున్నారు.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.