హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Big News: తారకరత్నకు గుండెపోటు..క్రిటికల్ గా ఆరోగ్య పరిస్థితి..బెంగళూరు తరలింపు..

Big News: తారకరత్నకు గుండెపోటు..క్రిటికల్ గా ఆరోగ్య పరిస్థితి..బెంగళూరు తరలింపు..

తారకరత్న (PC: Twitter)

తారకరత్న (PC: Twitter)

లోకేష్ యువగళం పాదయాత్ర తొలిరోజే అపశృతి చోటు చేసుకుంది. లోకేష్, బాలకృష్ణ, టీడీపీ కార్యకర్తలతో కలిసి తారకరత్న పాదయాత్రలో పాల్గొన్నారు. అయితే ఈ క్రమంలో తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తాజాగా తారకరత్నకు కేఈసీ మెడికల్ కాలేజీలో యాంజియోగ్రామ్ చేసి స్టంట్ వేశారు వైద్యులు. వైద్య పరీక్షల అనంతరం ఆయనకు గుండెపోటు వచ్చిందని నిర్ధారించిన వైద్యులు ఈ స్టంట్ వేసినట్టు తెలుస్తుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

Nandamuri Tarakaratna Health Condition |  లోకేష్ యువగళం పాదయాత్ర తొలిరోజే అపశృతి చోటు చేసుకుంది. లోకేష్, బాలకృష్ణ, టీడీపీ కార్యకర్తలతో కలిసి తారకరత్న పాదయాత్రలో పాల్గొన్నారు. అయితే ఈ క్రమంలో తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తాజాగా తారకరత్నకు కేఈసీ మెడికల్ కాలేజీలో యాంజియోగ్రామ్ చేసి స్టంట్ వేశారు వైద్యులు. వైద్య పరీక్షల అనంతరం ఆయనకు గుండెపోటు వచ్చిందని నిర్ధారించిన వైద్యులు ఈ స్టంట్ వేసినట్టు తెలుస్తుంది. ఇక మెరుగైన వైద్యం కోసం ఆయనను బెంగళూరుకు తరలించే అవకాశం ఉంది. ఈ విషయం తెలుసుకున్న బాలకృష్ణ ఆసుపత్రికి వెళ్లి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఫోన్ చేసి తారకరత్న హెల్త్ కండీషన్ గురించి అడిగి తెలుసుకున్నారని సమాచారం.

Tirupati: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. గోవింద్ యాప్ పేరు మారింది..

క్రిటికల్ గానే తారకరత్న ఆరోగ్యం..

కాగా ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం క్రిటికల్ గానే ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన గుండెకు రేండు వైపులా కూడా బ్లాక్స్ ఉన్నాయని వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు సీపీఆర్, యాంజియోగ్రామ్ చేశారు. గుండెకు రెండు కంటే ఎక్కువ బ్లాక్స్ ఉండడంతో ఆయన ఆరోగ్యం కుదుటపడడం లేదని తెలుస్తుంది. అయితే ఆయనకు కుప్పంలోనే చికిత్స అందిస్తారా లేక ఎయిర్ లిఫ్టింగ్ ద్వారా బెంగళూరుకు తరలిస్తారా అనేది చూడాలి. తారకరత్న ఆరోగ్యంపై చంద్రబాబు సహా ఇతర కుటుంబసభ్యులు ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.

Yuvagalam: యువగళంతో లోకేష్ సీఎం అవుతారా..? పాదయాత్ర సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా..?

అసలేం జరిగింది?

ఉదయం 11 గంటలకు లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం కాగా..ఈ పాదయాత్రలో బాలకృష్ణ,  తారకరత్న పాల్గొన్నారు. ఈ క్రమంలో లక్ష్మీపురం సరి వరదరాజ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొద్ది దూరం నడిచాక మసీదులో ప్రార్ధనలు చేశారు. అయితే మసీదు నుండి బయటకు వచ్చే క్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు చుట్టు ముట్టడంతో ఒత్తిడి తట్టుకోలేక తారకరత్న ఒక్కసారిగా సొమ్మసిల్లి కుప్పకూలిపోయారు. ఆయనను ఆసుపత్రికి తరలించగా వైద్యులు ప్రథమ చికిత్సలో భాగంగా సీపీఆర్ చేసిన వైద్యులు హార్ట్ బీట్ ను పునరుద్దరించినట్టు తెలుస్తుంది. ఇప్పటికి కూడా ఆయన స్పృహలోకి రాలేదని సమాచారం.

అయితే ఆయనను ఆసుపత్రికి తీసుకొచ్చిన సమయంలో పల్స్ లేదు. ట్రీట్ మెంట్ స్టార్ట్ చేశాం. 45 నిమిషాల తరువాత పల్స్ మొదలయింది. మా ప్రయత్నం మేము చేస్తున్నామని, ఆరోగ్యం మెరుగుపడుతుందని భావిస్తున్నాం అని వైద్యులు తెలిపారు. ఇక ఆయనను గ్రీన్ ఛానల్ ద్వారా బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రికి తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక తారకరత్న త్వరగా కోలుకోవాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు.

First published:

Tags: Andhrapradesh, Ap, AP News, Nara Lokesh, TDP

ఉత్తమ కథలు