టీడీపీ మహానాడు, చంద్రబాబు నాయుడుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా వ్యంగాస్త్రాలు సంధించారు. ‘జూమ్ కాన్ఫరెన్సుతో మహానాడట!.. రెండొందల మంది భజంత్రీలు కూర్చుంటే “మహా” ఎలా అవుతుందో కాస్త వివరిస్తే సంతోషిస్తాం. అధికారంలో ఉన్నన్నాళ్లు ప్రజల సొమ్ముతో హిమాలయా వాటర్ తప్ప వేరే నీళ్లు దిగలేదు. ఇప్పుడు ఆ బాటిల్స్ కనిపించడం లేదు. అలవాట్లు మారాయా?’అంటూ సెటైరికల్గా ఎంపీ ట్వీట్ చేశారు. ఇక కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ సమయంలోనూ ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రశంసిస్తూ విజయసాయి రెడ్డి మరో ట్వీట్ చేశారు. ‘ఏడాది కాలంలో లాక్డౌన్ వల్ల మూడు నెలలు రాబడి లేకపోయినా 90 శాతం హామీలు నెరవేర్చారని కొనియాడారు. వివిధ కార్యక్రమాల కింద రూ.3.60 కోట్ల మందికి రూ.40 వేల కోట్ల సాయం అందింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులన్నీ కొనసాగుతున్నాయి. పోలవరం వచ్చే ఏడాది వర్షాకాలం నాటికి పూర్తవుతుంది’అంటూ ట్విటర్లో విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Vijayasai reddy