MLA VALLBHANENI VAMSHI AIDE THREATENS VILLAGE VOLOUNTEERS MK
ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై గ్రామ వాలంటీర్ల ఆగ్రహం...ధర్నా..
వల్లభనేని వంశీ మోహన్(File)
ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుడు అయిన యతేంద్ర రామకృష్ణ అలియాస్ రాము గ్రామ వాలంటీర్లపై దౌర్జన్యం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. దీంతో గ్రామ సచివాలయం ముందే వాలంటీర్లు ధర్నాకు దిగారు.
ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుడు అయిన యతేంద్ర రామకృష్ణ ( అలియాస్ రాము ) గ్రామ వాలంటీర్లపై దౌర్జన్యం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. దీంతో గ్రామ సచివాలయం ముందే వాలంటీర్లు ధర్నాకు దిగారు. రాము అనే వ్యక్తి సచివాలయంకి వచ్చి ఉద్యోగులపై అసభ్యపదజాలం తో మీ అంతు చూస్తాను అంటూ దూషించాడని, దీంతో భయపడిన వాలంటీర్లు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. కాగా వాలంటీర్ల ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదని, రాము అనే వ్యక్తిని పట్టించుకోలేదని వాలంటీర్లు వాపోతున్నారు. అధికారులు పట్టించుకోక, పోలీసులు పట్టించుకోక, మాకు న్యాయం చేసేది ఎవరు అని వాలంటీర్లు వాపోతున్నారు.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.