MINSTER PERNI NANI COMMENTS ON RRR AND RADHE SHYAM MOVIE RELEASE AND MEETING WITH RGV NGS
Minster Nani: ఆర్ఆర్ఆర్.. రాధేశ్యామ్ వాయిదాకు అదే కారణం.. మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ రిలీజ్ వాయిదాలకు కారణం అదే
Minster Nani on RRR and Radhe Shaym Movies: రామ్ గోపాల్ వర్మతో భేటీ ముగిసిన తరువాత మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్ల ధరలపై కమిటీ రేపు క్లారిటీ ఇస్తుంది అన్నారు. అలాగే ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్ సినిమాల వాయిదాకు అదే కారణమంటూ వ్యాఖ్యానించారు..
Minster Parni Nani on RRR and Radhe Shyam: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సినిమా టికెట్ల వ్యవహారం.. ఇతర సమస్యలపై తన అభిప్రాయాలను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) చెప్పారు అన్నారు మంత్రి పేర్ని నాని (Minster Perni Nani). సుమారు రెండున్నర గంటల పాటు మంత్రితో ఆర్జీవీ మాట్లాడారు. అయితే కేవలం వర్మ మాత్రమే కాదని.. టాలీవుడ్ (Tollywood) సమస్యలపైనా.. లేదా టికెట్ల రేట్లు తగ్గించడంపై అభ్యంతరాలు ఉంటే ఎవరైనా తమకు చెప్పవచ్చన్నారు. తమతో మాట్లాడడం ఇష్టం లేదనుకుంటే నేరుగా కమిటీ ముందు హాజరై.. తమ అభిప్రాయాలు చెప్పవచ్చని సూచించారు మంత్రి పేర్ని నాని.. రేపు మరోసారి ప్రభుత్వం వేసిన కమిటీ చర్చలు జరుపుతుందని.. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే టికెట్ల రేట్లపై సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. తాము చట్టం ప్రకారమే అంతా చేస్తున్నామన్నారు. అలాగే ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ (RRR), రాధేశ్యామ్ (Radhe Shyam) లాంటి సినిమా రిలీజ్ ల వాయిదాకు ఏపీ ప్రభుత్వ నిర్ణయమే కారణమని వర్మ వ్యాఖ్యలపైనా మంత్రి పేర్ని నాని స్పందించారు..
తనతో దర్శకుడు వర్మ చర్చించిన సందర్భంలో ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ సినిమాల వాయిదాలపై మాట్లాడలేదన్నారు. అయితే ఆయన ఏమన్నారో తనకు తెలియదని.. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ తో సహా పెద్ద సినిమాలు ఏవి వాయిదా పడ్డా.. అందుకు కేవలం కరోనా పరిస్థితులే కారణమన్నారు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు ఉన్నాయని.. ఇలాంటి సమయంలో సినిమా రిలీజ్ చేస్తే కష్టమనే ఉద్దేశంతోనే వాటి రిలీజ్ ను వాయిదా వేశారని తాను అభిప్రాయ పడుతున్నాను అన్నారు.
అలాగే నాగార్జున ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా మాట్లాడారా అన్నదానిపైనా స్పందించారు నాని.. సినిమా హీరోగా.. నిర్మాతగా నాగార్జునకు.. మంత్రిగా తనకు సమస్య లేనప్పుడు మీకేంటి సమస్య అంటూ తిరిగి ప్రశ్నించారు..
అంతకుముందు ఈ భేటీ పై వర్మ ఏమన్నారంటే.. కేవలం పరిశ్రమలో నెలకొన్న తాజా సమస్యలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు రామ్ గోపాల్ వర్మ చెప్పారు. అయితే ప్రభుత్వం ముందు తాను ఎలాంటి డిమాండ్లు పెట్టలేదు అన్నారు. పరిశ్రమలో ఉన్న ప్రస్తుత సమస్యలపై తన అభిప్రాయాలు మాత్రమే చెప్పానని.. ఎవరి తరపున తాను మాట్లాడడానికి రాలేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు. సినిమా పెద్దల తరుపున కానీ... లేదా తాను డిస్ట్రిబ్యూటర్ల తరఫునో.. నిర్మాతల తరఫునో మంత్రిని కలవలేదన్నారు. అలాగే ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ ల సినిమా రిలీజ్ వాయిదా పడడానికి ఏపీలో టటికెట్ల వ్యవహారం కూడా ఒక కారణం కావొచ్చు అన్నారు. ముఖ్యంగా పుష్ప సినిమా కలెక్షన్లను చూసిన తరువాతే ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు అన్నారు.
ఇండస్ట్రీకి ఉన్న సమస్యలు ప్రభుత్వానికి అర్థమయ్యాయి అనుకుంటున్నా అన్నారు . ఏ సమస్య అయినా ఒక్కరోజుతోనే తీరుపోదు అన్నారు. అయితే దిశగా తర్వాత చర్యలు జరగాల్సి ఉంది అన్నారు. తన సూచనలను మంత్రి విన్నారని. ఈ సమావేశంపై తాను వందకు వంద శాతం సాటిస్ఫై అయ్యాను అన్నారు ఆర్జీవీ. అలాగే కేవలం పవన్ కళ్యాణ్, బాలయ్యలపై కోపంతోనే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని తాను అనుకోవడం లేదన్నారు వర్మ..
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.