news18-telugu
Updated: November 7, 2019, 6:15 PM IST
ప్రతీకాత్మక చిత్రం
రాష్ట్ర విభజన జరిగినా ఆర్టీసీ విలీనం జరగలేదని సొలిసిటర్ జనరల్ తెలంగాణ హైకోర్టుకు తెలపడం కొత్త చర్చకు తెరలేపిన సంగతి తెలిసింది. కేంద్రం వాదనతో ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని భావిస్తున్న ప్రభుత్వానికి ఇబ్బందులు రావొచ్చనే అనుమానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో దీనిపై ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఈ అంశంపై మీడియా ప్రతినిధులతో జరిగిన చిట్చాట్లో పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆర్టీసీ పరిణామాల ప్రభావం ఏపీపై ఉండదని...ఏపీలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు.
ఏపీలో ఆర్టీసీ కార్మికుల విలీనానికి ఆర్టీసీ బోర్డు అంగీకరించిందని స్పష్టం చేశారు. ఆర్టీసీ బోర్డులో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ఉన్నారని పేర్ని నాని గుర్తు చేశారు. ఆర్టీసీ విభజన అనేది సాంకేతికపరమైన అంశం మాత్రమే అని ఆయన అభిప్రాయపడ్డారు. విభజన జరగలేదన్న కేంద్రం...ఏపీ, తెలంగాణకు విడివిడిగా ఎలక్ట్రిక్ బస్సులు నిధులు ఎలా కేటాయించిందని అన్నారు. విలీనానికి ఇబ్బంది లేకుండా సాంకేతిక ఇబ్బందులు అధిగమనిస్తామని పేర్ని నాని తెలిపారు.
Published by:
Kishore Akkaladevi
First published:
November 7, 2019, 6:15 PM IST