హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

కడప జిల్లాలో వైసీపీ ఏజెంట్... టీడీపీ నేత సీఎం రమేష్ మధ్య వాగ్వాదం

కడప జిల్లాలో వైసీపీ ఏజెంట్... టీడీపీ నేత సీఎం రమేష్ మధ్య వాగ్వాదం

సీఎం రమేష్ (File)

సీఎం రమేష్ (File)

AP Assembly Election 2019 : సజావుగా సాగాల్సిన ఎన్నికల్లో అక్కడక్కడా అపశ్రుతులు దొర్లుతున్నాయి.

    కడప జిల్లా ఎర్రగుంట మండలంలోని పొట్లదుర్తిలో వైసీపీ ఏజెంట్, టీడీపీ నేత సీఎం రమేష్ మధ్య వాగ్వాదం జరిగింది. సీఎం రమేష్ పోలింగ్ స్టోషన్ లోకి వెళ్తుండగా... వైసీపీ ఏజెంట్ అడ్డుకోవడంతో గొడవ జరిగింది. తనపై వైసీపీ ఏజెంట్ చేయి చేసుకున్నారంటూ పోలింగ్ స్టేషన్ ముందు భైటాయించారు సీఎం రమేష్. ఆయన మద్దతు దారులు ఆయనకు అండగా ఉండటంతో... పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. పోలింగ్‌కి అంతరాయం ఏర్పడుతోందంటూ ఎన్నికల అధికారులు రెండు వర్గాల వారినీ శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. ఐతే... సీఎం రమేష్ మాత్రం వెనక్కి తగ్గలేదు. వైసీపీ కావాలని కుట్రలు పన్నుతోందని ఫైర్ అయ్యారు.

    First published:

    Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Lok Sabha Election 2019, Telangana Lok Sabha Elections 2019

    ఉత్తమ కథలు