Lok Sabha Election 2019 : ఎన్నికలకు సంబంధించి మాక్ పోలింగ్ కొనసాగుతోంది. అయితే కొన్ని చోట్ల ఈవీఎంలు, వీవీప్యాట్లు సరిగా పనిచెయ్యట్లేదు. బటన్ నొక్కితే బీప్ సౌండ్ రావట్లేదు. కొన్నిచోట్ల మాక్ పోలింగ్లో ఓటు వేస్తే, వీవీప్యాట్లో స్లిప్ కనిపించట్లేదు. ఇలాగేతే ఇబ్బందే అనుకుంటున్నారు అధికారులు. గుంటూరు జిల్లాలో ఈవీఎంలు, వీవీప్యాట్లు సరిగా పని చేయట్లేదని తెలిసింది. అక్కడ కొన్ని చోట్ల మాక్ పోలింగ్ మొదలవ్వలేదు. కొన్ని చోట్ల మాత్రం అభ్యర్థుల ఏజెంట్లకు ఈవీఎంలు, వీవీప్యాట్లపై పోలింగ్ సిబ్బంది అవగాహన కలిగిస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా ఈవీఎంలు మొరాయిస్తున్న సమస్య కనిపిస్తోంది. ఇదే కంటిన్యూ అయితే... పోలింగ్ ఈవెనింగ్ 6లోపు కంప్లీట్ అవ్వడం కష్టమంటున్నారు అధికారులు.
లోకసభ, పార్లమెంట్ సభ్యులకు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి... ఎవరైనా ఫిర్యాదులు, సమస్యలు చెప్పాలనుకుంటే 24 గంటలూ పనిచేసేలా 08672-252176, 252377 ఫోన్ నంబర్లతో కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Telangana Lok Sabha Elections 2019