Leopard Tension: కర్నూలు జిల్లా (kurnool District)లోని ప్రముఖ పుణ్య క్షేత్రం అహోబిలం (Ahobilam)లో చిరుత (leopard) సంచారం కలకలంగా మారింది. ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో.. ఎవరి పై దాడి చేస్తుందో తెలియక టెన్షన్ పడుతున్నారు. అటు వైపు వెళ్లాలి అంటే ఇటీవల జరిగిన దాడులే భక్తులకు గుర్తుకు వస్తున్నాయి. దీంతో కాస్త చీకటి పడిన తరువాత అటు వెళ్లాలి అంటే చిరుత దాడులే గుర్తువస్తున్నాయి. తాజాగా ఆళ్లగడ్డ మండలం ఎగువ అహోబిలంలో మరోసారి చిరుత దాడికి తెగబడింది. అహోబిలం ఆలయం దగ్గర భక్తుడి (Devotee)పై చిరుత దాడి చేసింది. ఎప్పటిలాగే ఓ భక్తుడు.. పావన నరసింహా స్వామి ఆలయ (Narasimha Swamy Temple)దర్శనం చేసుకుని.. ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఈ దాడి ఘటన చోటుచేసుకుంది. కాలి నడక దారిలో ఎదో ఆలోచించుకుంటూ వెళ్తున్న భక్తుడు సడెన్ గా షాక్ తిన్నాడు.. క్షణాల్లోనే తేరుకోవడంతో పెను ప్రమాదం నుంచి క్షేమంగా భయటపడ్డాడు.. ఏం జరిగిందంటే.. అలా వెళ్తున్న భక్తుడిపై ఒక్కసారిగా చిరుతు దాడి చేసింది. వెంటనే అప్రమత్తమైన భక్తుడు.. మెట్లపై నుంచి కిందకు దూకి ప్రాణాలను రక్షించుకున్నాడు. వెంటనే ఆయన తనకు జరిగి దాడికి సంబంధించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
ఇదే మొదటి సారి కాదు..ఇటీవల ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లి పంట పొలాల్లో చిరుత సంచారం రైతులు భయపడేలా చేస్తోంది. ఓ రైతు… పంటకు నీరు అందించి బైక్పై వెళ్తుండగా చిరుత ఎదురుపడింది. దీంతో అతను తీవ్ర భయాందోళనకు గురై అక్కడి నుంచి తప్పించుకున్నాడు. పులి సంచారంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. రైతులు, గ్రామస్తులు, అటవీ శాఖ అధికారులతో కలిసి పులి కోసం పంట పొలాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అధికారులు అలాంటిదేం లేదు అని మొదటిలో కొట్టి పారేసే ప్రయత్నం చేశారు. కానీ గత వారం రోజులుగా చిరుత సంచారంతో అహోబిలం ఆలయ పరిసరాల ప్రాంతాల భక్తులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అహోం బిలంలోనే చిరుత ఉంటోంది అనడానికి ఇటీవల బయటపడ్డ సీసీటీవీ వీడియోనే నిదర్శనం..
Leopard Tension || ప్రముఖ ఫుణ్యక్షేత్రం అహోబిలంలో చిరుత కలకలం || చివరికి... https://t.co/g7uHUvi6pB via @YouTube #leopard #leopardstown @AhobilamLokesh @snowleopards
— nagesh paina (@PainaNagesh) January 13, 2022
గత శుక్రవారం ఎగువ అహోబిలంలో చిరుత సంచరించింది. ఆలయం వెనుక భాగంలో ఉన్న రామానుజాచార్యులు మండపం దగ్గర ఉన్న కుక్క పిల్లను చిరుత పట్టుకుని పోయింది. అర్ధరాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో చిరుత ఆలయ పరిసరాల్లో సంచరించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించినవే ఆ సీసీటీవీ దృశ్యాలు.. దీంతో భక్తులు భయాందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి : కోడి పందేల కుక్కుట శాస్త్రం గురించి తెలుసా..? వాటికి ముహూర్తాలు చూస్తారా..?
ఇప్పటికైన అధికారులు అప్రమత్తమై.. చిరుత భయం పోయేలా చేయాలని వేడుకుంటున్నారు.. లేదంటే అహోబిలం వెళ్లాలి అంటే ఆలోచించాల్సి వస్తుందని.. ఇతర ప్రాంతల నుంచి కూడా భక్తుల రాకపోకలు తగ్గిపోయే ప్రమాదం ఉంది అంటున్నారు.. తాజాగా సీసీ టీవీ ఫుటేజ్ అధారంగా చిరుత కోసం అటవీ అధి,కారులు ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టారు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.