హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Affair: ప్రియుడితో కలిసి భర్తకు దొరికిపోయింది.. గంట తర్వాత షాకింగ్ ఘటన..

Affair: ప్రియుడితో కలిసి భర్తకు దొరికిపోయింది.. గంట తర్వాత షాకింగ్ ఘటన..

కర్నూలు జిల్లాలో ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

కర్నూలు జిల్లాలో ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

Extramarital Affair: క్షణిక సుఖాల కోసం చాలా మంది పండంటి కాపురాలను నాశనం చేసుకుంటున్నారు. హాయిగా సాగే జీవితంలో... నిప్పుల కుంపటి లాంటి వివాహేతర సంభందాలు పెట్టుకొని జీవితాన్ని సర్వ నాశనం చేసుకుంటున్నారు. నిండు నూరేళ్లు కలసి పిల్లాపాపలతో హాయిగా ఉండాల్సిన జీవితం కాస్త కటకటాలపాలవుతోంది.

ఇంకా చదవండి ...

GT Hemanth Kumar, News18, Tirupati

క్షణిక సుఖాల కోసం చాలా మంది పండంటి కాపురాలను నాశనం చేసుకుంటున్నారు. హాయిగా సాగే జీవితంలో... నిప్పుల కుంపటి లాంటి వివాహేతర సంభందాలు పెట్టుకొని జీవితాన్ని సర్వ నాశనం చేసుకుంటున్నారు. నిండు నూరేళ్లు కలసి పిల్లాపాపలతో హాయిగా ఉండాల్సిన జీవితం కాస్త కటకటాలపాలవుతోంది. తరచూ ప్రియునితో సరసాలు ఆడుతున్న భార్యను మందలించాడు ఓ భర్త. మరోసారి ఇలాంటి తప్పులు చేస్తే సహించేది లేదని భార్యను బెదిరించాడు. అప్పటికే ప్రియుడి మోజులో ఉన్న ఆ మహిళ.. అతడితో కలసి దారుణానికి ఒడిగట్టింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కర్నూలు జిల్లా (Kurnool District) లో చోటు చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా కోడుమూరులో లక్ష్మీ, సుధాకర్ అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.

ఎంతో హాయిగా సాగుతున్న వీరి సంసార సాగరంలో అక్రమ సంబంధం అనే పెను తుఫాను సునామీని సృష్టించింది. గత కొనేళ్ళ క్రిందట లక్ష్మీకి అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న దస్తగిరితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. భార్య చనిపోయిన దస్తగిరి.. లక్ష్మితో ఎఫైర్ నడుపూతే.. తనకు భార్య లేని లోటు తిరుస్తున్నావని మరింత ఆప్యాయంగా మాట్లాడేవాడు.

ఇది చదవండి: ప్రియుడితో కలిసి భర్తను చంపింది.. సూసైడ్ అని నమ్మించింది.. కాలి చెప్పుతో మిస్టరీ వీడింది..


ఐతే గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న వ్యవహారం కాస్తా ఓ రోజు భర్త సుధాకర్ కంటపడింది. దీంతో లక్ష్మీ సుధాకర్ మధ్య... విబేధాలు తారాస్థాయికి చేరాయి. భర్త బ్రతికి ఉంటే ప్రియుడితో కలిసే అవకాశం రాదని భావించి పక్క ప్లాన్ రచించింది. మద్యం మత్తులో ఉన్న సుధాకర్ ను పథకం ప్రకారం అత్యంత దారుణంగా హతమార్చి ఆపై ఊరి పొలిమేరలో ప్రియుడితో కలిసి మృతదేహాన్ని పూడ్చిపెట్టింది. కుమారుడు కనిపించక పోయే సరికి తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కోడలు, ఆమె ప్రియుడిపై అనుమానం వ్యక్తం చేశాడు.

ఇది చదవండి: ప్రాణం తీసిన శోభనం.. ఫస్ట్ నైట్ భయంతో యువకుడు ఏం చేశాడంటే..!


 పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించడంతో చేసిన ఘోరాన్ని కళ్లకు కట్టినట్లు వివరించారు. తామిద్దరం ఏకాంతంగా ఉండగా.. భర్త సుధార్ వచ్చి దాడికి యత్నించడంతో అతడ్ని చంపి మృతదేహాన్ని తుప్పల్లో పూడ్చిపెట్టినట్లు నిందితులు విచారణలో వెల్లడించారు. ఇటీవల పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఇలాంటి ఘటనే జరిగింది. పెళ్లికి ముందు నుంచి బావతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళ.. ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసి మృతహాన్ని ఊరిచివర పడేసింది. ఆ తర్వాత భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు అందర్నీ నమ్మించింది. తే మృతుడి కాలికి ఒకే చెప్పు ఉండటంతో అనుమానించిన పోలీసులు కూపీ లాగగా.. మర్డర్ మిస్టరీ వెలుగులోకి వచ్చింది.

First published:

Tags: Andhra Pradesh, Extramarital affairs, Kurnool, Wife kill husband

ఉత్తమ కథలు