మన దేశంలో హిందువులు జరుపుకునే అతిపెద్ద పండగల్లో శివరాత్రి కూడా ఒకటి. ఆ రోజు భక్తులు ఉపవాసాలు ఉండి.. శివాలయాన్ని దర్శించుకుంటారు. రాత్రంతా జాగారం చేస్తారు. శివరాత్రి (Shiv Ratri 2023) రోజు దేశవ్యాప్తంగా ఉన్న శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ శివాలయమైన శ్రీశైలం (Sri Bhramaramba Mallikarjuna Swamy Temple) లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. శివ మాల విరమణకు వచ్చి స్వాములు, ఇతర భక్తులతో శ్రీశైల క్షేత్రం (Srisailam) ప్రత్యేక కళను సంతరించుకుంటుంది. శివరాత్రి సందర్భంగా.. ఈసారి ఫిబ్రవరి 11 నుంచి 21 వరకు మహాశివరాత్రి బ్రహోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల రోజుల్లో.. ఆలయ దర్శన విధానాల్లో కీలక మార్పులు చేసినట్లు ఈవో లవన్న తెలిపారు.
Tirumala: ఆటోమేటిక్ యంత్రాలతో తిరుమల శ్రీవారి లడ్డూల తయారీ.. ఏకంగా రూ.50 కోట్లు.!
శ్రీశైలంలో శివరాత్రి బ్రహోత్సవాల నేపథ్యంలో.. శివయ్య భక్తులకు అటవీశాఖ కొంత వెసులుబాటు కల్పించింది. భక్తులు పెద్ద ఎత్తున శ్రీశైలానికి తరలి రానున్న నేపథ్యంలో.. అభయారణ్యంలో రాత్రిళ్లు సైతం వాహనాల రాపోపోకలకు అనుమతి ఇచ్చింది. ఐతే అందుకు కొన్ని షరతులను విధించింది. వాహనాలలో శ్రీశైలం వచ్చే భక్తుల 40 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. అభయారణ్యంలో ఎక్కడా కూడా వాహనాలను నిలుపకూడదు. దేవదాయ, అటవీ అధికారులు కేటాయించిన సిబ్బంది పర్యవేక్షణలో పయనించాల్సి ఉంటుంది. శివరాత్రి బ్రహోత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం శ్రీశైలంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Kurnool, Local News