హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

పోలీస్ స్టేషన్ ఎదుట సైకో వీరంగం.. వెళ్లి ఆరా తీస్తే షాకింగ్ సీన్

పోలీస్ స్టేషన్ ఎదుట సైకో వీరంగం.. వెళ్లి ఆరా తీస్తే షాకింగ్ సీన్

X
కర్నూలు

కర్నూలు జిల్లా పత్తికొండలో సైకో హల్ చల్

కొందరు మతిస్థిమితం లేక చేసే పనులు జనాలను హడలెత్తిస్తుంటాయి. కానీ కొందరు మానసిక సమస్యలతో సైకోలుగా మారుతుంటారు. అలాంటి వారు జనాన్ని బెంబేలెత్తిస్తుంటారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Kurnool, India

Murali Krishna, News18, Kurnool

కొందరు మతిస్థిమితం లేక చేసే పనులు జనాలను హడలెత్తిస్తుంటాయి. కానీ కొందరు మానసిక సమస్యలతో సైకోలుగా మారుతుంటారు. అలాంటి వారు జనాన్ని బెంబేలెత్తిస్తుంటారు. అలాంటి సైకో కర్నూలు జిల్లా ప్రజలను హడలెత్తించాడు. కర్నూలు జిలలా పత్తికొండలో సైకో వీరంగానికి జనం పరుగులు పెట్టారు. అది కూడా పోలీస్ స్టేషన్ ఎదురుగానే సైకోయిజాన్ని ప్రదర్శించాడు. జనాలపై దాడి చేయడమే కాకుండా.. రోడ్డుపై వెళ్లే వాహనాలపై రాళ్లు విసిరి అద్దాలు ధ్వంసం చేశాడు. అడ్డొచ్చిన వారిపై ఇనుప రాడ్డుతో దాడికి యత్నించడంతో అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఇదంతా పోలీస్ స్టేషన్ ఎదుటే జరుగుతున్నా ఎవరూ అటువైపు వెళ్లలేదు.

ఓ ఆర్టీసీ బస్సుపైకి రాళ్లు విసరడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో కండక్టర్, డ్రైవర్ ఫిర్యాదు చేసిన తర్వాతే పోలీసులు స్పందించారు. వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకోని విచారించగా.. సదరు సైకో హోసూరు గ్రామానికి చెందిన కు చెందిన వన్నూరు సాహెబ్ గా స్థానికులు గుర్తించారు. ఐతే దీనిపై పోలీసులు కూడా సరిగా సమాధానం చెప్పకపోవడం గమనార్హం.

ఇది చదవండి: తన వల్లే భార్యకు అలా జరిగిందని అంత పని చేశాడు

పోలీస్ స్టేషన్ ఎదుట సైకో వీరంగం వేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే పోలీసులు కనీసం స్పందించపోవడం, సమాధానం చెప్పకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. పొరబాటున అతడి దాడిలో ఎవరైనా గాయపడి ఉంటే పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. ఘటన ఎక్కడో మారుమూల జరిగితే ఫర్వాలేదు.. కానీ పోలీస్ స్టేషన్ వద్దే జరిగినా స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Kurnool, Local News

ఉత్తమ కథలు