Murali Krishna, News18, Kurnool.
తప్పు చేసిన వారికి బుద్ధి చెప్పాల్సిన పొజిషన్ లో ఆయన ఉన్నారు. అవసరమైతే.. చట్టపరంగా చర్యలు తీసుకునే అధికారం ఉంది. నలుగురికీ మంచి చెడులు చెప్పాల్సిన వ్యక్తి ఆయన.. కానీ అతడు చేసిన పని చూసి.. ఛీ ఛీ ఇదేం పాడు బుద్ధి అని తిట్టుకుంటున్నారు. అది కూడా నడి రోడ్డుపై.. ఇంతకీ ఏం జరిగింది అంటే..? కర్నూలు జిల్లాలో ఏసీబీ వలకు మరో అవినీతి చేప చిక్కింది. స్థలం వివాదంలో బాధితులకు న్యాయం చేస్తానంటూ లంచం డిమాండ్ చేసిన సి. బెలగల్ ఎస్సై శివాంజల్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. బాధితుల నుంచి లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు.
సిని పక్కీలో జరిగిన ఘటనలో ఇప్పుడు కర్నూలులో చర్చనీయాంశమైంది. కోడుమూరు నియోజకవర్గం, సి బెళగల్ మండలంకు చెందిన ప్రకాష్ ఆచారి అనే వ్యక్తి తన ఇంటి పక్క స్థల వివాదంలో ఈ బెళగల్ పోలీస్స్టేషన్ను ఆశ్రయించాడు.
అక్కడ ఎస్సై శివాంజనేయులకు తన సమస్యను వివరించి.. స్థల వివాదాన్ని పరిష్కరించాలని కోరాడు. అందుకు సంబంధించి డాక్యుమెంట్లను చూపారు. అయితే ఆ స్థల వివాదాన్ని పరిష్కరించాలంటే తనకు లక్ష రూపాయలు ఇవ్వాలంటూ లంచం డిమాండ్ చేశాడు.
దీంతో కంగు తిన్న ప్రకాష్ ఆచారి ఆ సొమ్ము ఇచ్చేందుకు మొదట నిరాకరించాడు. ఆ తర్వాత విషయాన్ని కర్నూలు అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించి వారి దృష్టికి తీసుకెళ్లాడు. అనంతరం ఏసిబి డిఎస్పి శివ నారాయణ స్వామి ఆదేశాల మేరకు సి బెళగల్ ఎస్సై శివ రామాంజనేయులతో మొదట చేసుకున్న ఒప్పందం మెరుపు సొమ్ము ఇచ్చేందుకు అంగీకరించాడు.
ఇదీ చదవండి: దేశమంతటా గణేష్ నిమజ్జనాలు ముగిశాయి.. ఈ గణపయ్యను మాత్రం విసర్జన చేయలేదు.. ఎందుకో తెలుసా?
ఆయా డబ్బును ముట్ట చెప్పడంలో భాగంగా కర్నూలు కలెక్టరేట్, మూడో పట్టణ పోలీస్స్టేషన్కు అతి సమీపంలోని మాంటిస్సోరి స్కూలు వద్ద రూ. 50 వేలు ఇచ్చేందుకు బాధితుడు సిద్ధమయ్యాడు. డబ్బు తీసుకొచ్చానంటూ బాధితుడు ఎస్సైని పిలిపించాడు. అక్కడికి వచ్చిన ఎస్ఐ తాను డిమాండ్ చేసిన డబ్బు చేతికొస్తుందని సంబర పడుతూ… రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా… అప్పటికే అక్కడ మాటు వేసిన ఏసీబీ( ACB) పోలీసులు అతను లంచం (Bribe) తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఇదీ చదవండి: కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో వింత శిశువు జననం..! ఆశ్యర్చపోతున్న డాక్టర్లు..!
మొదట ఆ సొమ్ము తనది కాదంటూ రోడ్డుపై పారేసి ఎస్సై (SI) మొరాయించినప్పటికీ… ఆ తర్వాత అంగీకరించక తప్పలేదు. లంచం తీసుకున్నది ఎస్ఐ అయినా సరే అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేసి నిర్దారణ చేశామని ఏసీబీ డిఎస్పీ శివనారాయన తెలిపారు.
ఇదీ చదవండి: చేనేత హస్తకళా మేళ ప్రారంభం..! మగువలను ఆకట్టుకుంటున్న హ్యాండ్ క్రాప్ట్ వస్తువులు..!
ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు ఎవ్వరైనా సమస్యలను తమ దృష్టికి తీసుకు రావాలని ఏసీబీ డీఎస్పీ శివనారాయణ తెలిపారు. లంచం డిమాండ్ చేసిన వ్యక్తి ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదని ఆయన తెలిపారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: ACB, Andhra Pradesh, AP News, Crime news, Kurnool, Local News