హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

అత్యంత దారుణమైన సంఘటన.. రహదారిపై యువకుని మృతదేహంతో ధర్నా

అత్యంత దారుణమైన సంఘటన.. రహదారిపై యువకుని మృతదేహంతో ధర్నా

రోడ్డుపై ధర్నా చేపట్టిన స్థానికులు..

రోడ్డుపై ధర్నా చేపట్టిన స్థానికులు..

Andhra Pradesh: జిల్లాలో అతి దారుణమైన ప్రమాద సంఘటన వెలుగు చూపింది. వల్లూరు నగర శివార్లలో వల్లూరు వద్ద, తాడిపత్రి జాతీయ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

జిల్లాలో అతి దారుణమైన ప్రమాద సంఘటన వెలుగు చూపింది. నగర శివార్లలో వల్లూరు వద్ద, కడప తాడిపత్రి జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే... నగరం నుండి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో వల్లూరు కలదు. ఈ గ్రామం పక్కనే కడప తాడిపత్రి జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం ఏడు గంటలకురహదారిపై వెళుతున్న ఒక బైకుని గుర్తు తెలియని ఒక వాహనం ఢీ కొన్న ఘటన ఇక్కడి ప్రజలని కలచివేసింది.

ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మరణించగా మరొకరికి తీవ్రగాయాలైనట్లు సమాచారం.మృతుడు వల్లూరు గ్రామంలో ఎస్సీ కాలనీలో నివసించే సురేంద్ర (30) గా గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రున్ని 108 వాహనంలో కడప రిమ్స్ కు తరలించారు.ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న బంధువులు, ఊరి ప్రజలు ఆగ్రహానికి గురయ్యారు.

మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ ప్రమాద సంఘటన చూడడానికి అక్కడికి వచ్చిన ప్రజలతో రహదారి నిండిపోయింది. దీనితో అక్కడి వాతావరణం గందరగోళంగా మారింది. వాహనాల రాకపోకలు చాలావరకు నిలిచిపోయాయి. ఈ సంఘటనకి సంబందించిన నిజా నిజాలు  అదే విధంగా మృతుని, క్షతగాత్రుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ  చేపట్టారు. అక్కడి ప్రాంతంలోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

First published:

Tags: Andhra Pradesh, Kadapa, Local News

ఉత్తమ కథలు