D.Prasad, News18, Kadapa
ఈ రోజు మాఘ సుద్ధ పంచమి, అనగా మాఘ మాసంలో శుక్ల పక్షం లో వచ్చే రోజుని మాఘ శుద్ధ పంచమి లేదా వసంత పంచమి అని కూడా పిలుస్తారు. ఈ రోజుకి ఎంతో ప్రత్యేకత వుంది. ఏమిటా ప్రత్యేకత అనుకుంటున్నారా..? ఈ రోజు సాక్షాతూ సరస్వతి అమ్మ వారు ఆవిర్భవించిన రోజు. హిందువులకి ఈ రోజు ఎంతో పవిత్రమైనది. ఈ రోజున సరస్వతి అనుగ్రహం పిల్లల మీద వుండాలని ఎంతో మంది తల్లిదండ్రులు ఈ రోజున సరస్వతి దేవి సమక్షంలో అక్షరాభ్యాసం నిర్వహించడం మన సనాతన ధర్మంలో ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయం.
మన కడప నగరంలో ఈ మాఘశుద్ధ పంచమిని పురస్కరించుకుని కడప నగరంలోని ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటైన చిన్మయా మిషన్, శ్రీ లలితా పంచాయతన ఆలయంలో పిల్లలకి అక్షరాభ్యాసాలని నిర్వహించారు. జగన్మాత స్వరూపిణి అయిన లలితా దేవి ఈ రోజు సరస్వతి దేవి స్వరూపంలో ప్రత్యేకపూజలు అందుకుని భక్తులకి దర్శనం ఇచ్చారు. ఈ అక్షరాబ్యాస కార్యక్రమంలో తల్లిదండ్రులు వారి 2 ,3 సంవత్సరాల పిల్లలకి అక్షరాభ్యాసాలని చేయించారు.
ఇదే రోజున సరస్వతి అమ్మ వారు ఆవిర్భవించడం వలన, ఈ రోజు వారి పిల్లలకి అక్షరాభ్యాసం చేయించడం ద్వారా వారు భవిష్యత్తులో విద్యా బుద్దులు నేర్చుకుని, సత్ప్రవర్తనతో ఉన్నత స్థానాలని అధిష్టిస్తారని తల్లిదండ్రులు భావిస్తారు. ఈ కార్యక్రమంలో పెద్దమొత్తంలో తల్లిదండ్రులు వారి పిల్లలకి అక్షరాభ్యాసం చేయించారు. ఈ అక్షరాభ్యాసం కార్యక్రమంలో మొదట గణపతి పూజతో ప్రారంభించి తరువాత సరస్వతి దేవికి భక్తిశ్రద్ధలతో తల్లిదండ్రులు పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత శ్రీ తురియానంద సరస్వతి గారు పిల్లలకి బలపం అందించి పలకపై, మరియు పసుపు కొమ్ముతో బియ్యంలో అక్షరాలను దిద్దించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kadapa, Local News