ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జబర్దస్త్ గెటప్ శ్రీను థాంక్స్ చెప్పాడు. ఎందుకో తెలుసా. విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున పరిహారం ప్రకటించారు. చికిత్స పొందుతున్న వారికి రూ.25000 నుంచి రూ.10 లక్షల వరకు సాయం ప్రకటించారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ చుట్టుపక్కల నివసించే 15000 మందికి ఒక్కొక్కరికి రూ.10వేల సాయం అందిస్తామని చెప్పారు. ఈ పరిహారానికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేసింది ప్రభుత్వం. ప్రస్తుతానికి రూ.30 కోట్లను రిలీజ్ చేసింది. దీనిపై గెటప్ శ్రీను స్పందించాడు. బాధితులకు అండగా నిలిచిన సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపాడు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.