హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటీషన్ పై సుప్రీంకోర్టులో విచారణ..ప్రతివాదులకు నోటీసులు..తదుపరి విచారణ ఎప్పుడంటే?

MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటీషన్ పై సుప్రీంకోర్టులో విచారణ..ప్రతివాదులకు నోటీసులు..తదుపరి విచారణ ఎప్పుడంటే?

ఎమ్మెల్సీ అనంతబాబు

ఎమ్మెల్సీ అనంతబాబు

ఎమ్మెల్సీ అనంతబాబు (MLC Ananthababu) బెయిల్ పిటీషన్ పై నేడు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ జరిగింది. డీఫాల్ట్ బెయిల్ కోసం సుప్రీంకోర్టును అనంతబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు కెవిఎట్ పిటిషన్ ను అనంతబాబు  (MLC Ananthababu) కుటుంబసభ్యులు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు  (Supreme Court) ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అలాగే తదుపరి విచారణను డిసెంబర్ 12కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. కాగా ఇప్పటికే రాజమండ్రిలోని ఎస్సి, ఎస్టీ కోర్టు, ఏపీ హైకోర్టు  (High Court) అనంతబాబు  (MLC Ananthababu) బెయిల్ పిటీషన్ కొట్టేశాయి. దీనితో అనంతబాబు కుటుంబసభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

ఎమ్మెల్సీ అనంతబాబు (MLC Ananthababu) బెయిల్ పిటీషన్ పై నేడు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ జరిగింది. డీఫాల్ట్ బెయిల్ కోసం సుప్రీంకోర్టును అనంతబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు కెవిఎట్ పిటిషన్ ను అనంతబాబు  (MLC Ananthababu) కుటుంబసభ్యులు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు  (Supreme Court) ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అలాగే తదుపరి విచారణను డిసెంబర్ 12కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. కాగా ఇప్పటికే రాజమండ్రిలోని ఎస్సి, ఎస్టీ కోర్టు, ఏపీ హైకోర్టు  (High Court) అనంతబాబు  (MLC Ananthababu) బెయిల్ పిటీషన్ కొట్టేశాయి. దీనితో అనంతబాబు కుటుంబసభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా డ్రైవర్ హత్య కేసులో అనంతబాబు  (MLC Ananthababu) నిందితునిగా ఉన్న విషయం తెలిసిందే.

Life Certificate: ఎస్‌బీఐ అందిస్తున్న ఈ సర్వీసుల గురించి మీకు తెలుసా? ఇంట్లోంచే ఆ పని పూర్తి చేయొచ్చు!

తన మాజీ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు  (MLC Ananthababu) నిందితునిగా ఉన్నారు. ఈ కేసులో అనంతబాబు  (MLC Ananthababu) మే 23 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో వుంటున్నారు. బెయిల్ కోసం అనంతబాబు  (MLC Ananthababu) విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో  ఏపీ హైకోర్టు (Andhra Pradesh High court) లో రెగ్యులర్ బెయిల్ పిటీషన్ వేశారు. దీనిపై సెప్టెంబర్ 26న ఏపీ హైకోర్టు (Andhra Pradesh High court) లో జరిగిన విచారణలో ఎమ్మెల్సీ అనంతబాబు (MLC Ananthababu) కు చుక్కెదురైంది. బెయిల్ పిటీషన్ ను కోర్టు  (Andhra Pradesh High court) కొట్టి వేసింది.

Bank Schemes: కస్టమర్లకు ట్రిపుల్ బొనాంజా.. 2 కొత్త స్కీమ్స్ తెచ్చిన బ్యాంక్, మరో కీలక నిర్ణయం!

ఎమ్మెల్సీ అనంతబాబు  (MLC Ananthababu) జైలులో ఉండగానే ఆ కుటుంబంలో మరో విషాదం నెలకొంది. అనంతబాబు  (MLC Ananthababu) తల్లి మంగరత్నం ఆగష్టు నెలలో మృతి చెందారు. దీనితో అతనికి రాజమండ్రి ఎస్సి, ఎస్టీ కోర్టు ప్రత్యేక అవకాశం కల్పించింది. తల్లి అంత్యక్రియలకు హాజరు కావడానికి 3 రోజుల పాటు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ మూడు రోజులు స్వగ్రామం ఎల్లవరం ధాటి బయటకు పోవద్దని అనంతబాబుకు  (MLC Ananthababu) కోర్టు తెలిపింది. అలాగే రూ.25 వేలు పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది.

ఇక తాజాగా బెయిల్ పై అనంతబాబు కుటుంబసభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ పై విచారించిన కోర్టు ప్రతివాదులకు నోటీసులు పంపిస్తూ విచారణను వచ్చే నెల 12కు వాయిదా వేసింది.

First published:

Tags: Ap, AP News, Supreme Court

ఉత్తమ కథలు