హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Ap News: రామాలయంలోకి వెళ్లి తాళం వేసుకున్న జనసేన నేతలు..ఇప్పటంలో అసలేం జరుగుతుంది?

Ap News: రామాలయంలోకి వెళ్లి తాళం వేసుకున్న జనసేన నేతలు..ఇప్పటంలో అసలేం జరుగుతుంది?

ఇప్పటం

ఇప్పటం

గుంటూరు జిల్లా ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతతో ఈరోజు ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్ల తొలగింపుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇళ్ల తొలగింపును నిరసిస్తూ జనసేన నేతలు స్థానిక రామాలయంలోని గర్భగుడిలో ఉండి నిరసన తెలుపుతున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

Ippatam Village | గుంటూరు జిల్లా ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతతో ఈరోజు ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్ల తొలగింపుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇళ్ల తొలగింపును నిరసిస్తూ జనసేన నేతలు స్థానిక రామాలయంలోని గర్భగుడిలో ఉండి నిరసన తెలుపుతున్నారు. గుడిలోకి ప్రవేశించిన వారు లోపలి నుంచి తాళం వేసుకొని ఆందోళన చేస్తున్నారు. వారిని బయటకు తీసుకురావడానికి పోలీసులు అనేక ప్రయత్నాలు చేస్తన్నారు. దీనితో మరోసారి ఇప్పటంలో హైటెన్షన్ నెలకొంది.

AP News: యువకుడిపై మూత్రం పోసి, గుండు కొట్టించి.. భార్య ప్రియుడి దురాగతం

ఇక అధికారులు రోడ్డు విస్తరణలో భాగంగా ప్రజల నివాసాలను, ప్రహరీ గోడలను రెండు జేసీబీల సహాయంతో కూల్చివేస్తున్నారు. అయితే ఈ కూల్చివేతలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. ఈ నిరసనల మధ్య కూడా అధికారులు కూల్చివేత పనులు కొనసాగిస్తున్నారు. కనీసం ఆర్టీసీ బస్సు కూడా రాని గ్రామానికి ఆరు లైన్ల రోడ్డు ఎందుకని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

Visakhapatnam: గుడ్ న్యూస్.. ఏపీలో కొత్తలో ఆరు లక్షల మందికి ఉద్యోగాలు ...!

ఇప్పటివరకు 12 ఇళ్లకు సంబంధించిన ప్రహారీలను తొలగించారు. ఇళ్ల తొలగింపు నేపథ్యంలో పోలీసులు భారీగా చేరుకున్నారు. ఎక్కడా కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ కూల్చివేతలను స్థానికులు అడ్డుకుంటున్నారు. నోటీసులు కూడా ఇవ్వకుండా అకస్మాత్తుగా కూల్చివేత ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఆలయంలోని జనసేన నేతలను బయటకు తీసుకురావడానికి పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

కాగా గతంలో కూడా ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతలు జరిగిన విషయం తెలిసిందే. అలాగే ఆ సమయంలో ఇప్పటం బాధితులు హైకోర్టును ఆశ్రయించగా..కోర్టు ఇళ్ల కూల్చివేతపై స్టే ఇచ్చింది. అయితే ఇప్పటం బాధితులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు. ఆయనే స్వయంగా ఇప్పటంకు వెళ్లి బాధితులకు సానుభూతి తెలిపారు. అంతేకాదు ఒక్కొక్క కుటుంబానికి రూ. లక్ష చొప్పున పార్టీ తరపున అందజేశారు. కానీ తాజాగా మళ్లీ ఇళ్ల కూల్చివేతతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

First published:

Tags: Ap, AP News, Janasena

ఉత్తమ కథలు