హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Amaravati: ముదురుతున్న అమరావతి ఆర్‌-5 జోన్ వివాదం.. అసలు ఆర్​5 జోన్​ అంటే ఏంటి?

Amaravati: ముదురుతున్న అమరావతి ఆర్‌-5 జోన్ వివాదం.. అసలు ఆర్​5 జోన్​ అంటే ఏంటి?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Amaravati: అమరావతిలో మరో వివాదం ముదురుతోంది.. ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా రైతులు మరో ఉద్యమానికి తెర లేపుతున్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఆర్ 5 జీవో పై పెను దుమారం రేగుతోంది. అసలు ఆర్ 5 జీవో అంటే ఏంటి.. వివాదాస్పదం ఎందుకు అవుతోంది..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

Amaravati: ఏపీ రాజధాని అమరావతి (AP Capital Amaravati) వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. తాజాగా ఆర్ 5 జో (R5 Zone) పై రైతులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఏమైంది అంటే.. ఏపీ హైకోర్టు (AP High Court), రాజధాని ప్రాంత రైతుల అభ్యంతరాలను కాదని అమరావతిలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం (AP Government) గెజిట్​ నోటిఫికేసన్​ విడుదల చేయడమే ఈ వివాదానికి కారణం. విజయవాడ (Vijayawada), గుంటూరు (Guntur) నగరాలకు చెందిన పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రత్యేక జోన్‌ ఏర్పాటు చేసింది. ఇప్పటికే సీఆర్‌డీఏ (CRDA) చట్ట సవరణ చేసిన ప్రభుత్వం, అమరావతి ప్రజారాజధాని కావాలంటే ప్రజలు నివసించటానికి ఇళ్ల స్థలాలు ఇస్తే తప్పేంటన్న కోణంలో.. తాజాగా జీవోను తెరపైకి తెచ్చింది. తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు, మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాల పరిధిలో 900.97 ఎకరాల మేర పేదల ఇళ్ల కోసం జోనింగ్‌ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

రాజధాని అమరాతిలో ఎంపిక చేసిన భూముల ప్రాంతాన్ని ఆర్‌-5 జోన్‌గా పేర్కొంటూ గెజిట్​ నోటిఫికేషన్​ జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. దీని ప్రకారం. అమరావతి రాజధాని మాస్టర్‌ ప్లాన్‌లో కూడా మార్పులు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఆర్‌-5 జోన్‌పై అభ్యంతరాలు, సూచనలు, సలహాలు స్వీకరించటానికి 15 రోజుల గడువు ఇచ్చింది. కానీ మొదటి నుంచి స్థానిక రైతులు దీన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు.

ఇప్పటికే దీనిపై కొంతమంది హైకోర్టుకు వెళ్లారు. కోర్టు కేసులతో సంబంధం లేకుండా టెక్నికల్ అంశాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆర్‌-5 జోన్‌ పేరుతో ముందుకే వెళ్తోంది. రాజధాని భూములను ఇతరులకు కేటాయించేందుకు అడుగులు వేస్తోంది. గుంటూరు , విజయవాడ నగరాలకు చెందిన దాదాపు 28 వేల మందికి ప్రస్తుతం ఆర్‌-5 జోన్‌ పరిధిలోకి తీసుకువచ్చిన గ్రామాలలో గతంలో ఇళ్ల స్థలాలను కేటాయించింది. దీనిపై రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించారు.

ఇదీ చదవండి : గంటా రాజీనామా ఆమోదం..? ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ వైసీపీ రివర్స్ షాక్..!

అప్పట్లోనే ప్రభుత్వ చర్యలను హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. రాజధాని నిర్మాణం కోసం తీసుకున్న భూముల విషయంలో రైతులకు ఇచ్చిన హామీలకు, చేసుకున్న ఒప్పందాలకు భిన్నంగా వెళ్లటం తగదని, ఈ రకమైన చర్యలు చెల్లవని పేర్కొంది. ఈ క్రమంలో ప్రభుత్వం మూడో కంటికి తెలియకుండా సీఆర్‌డీఏ చట్టంలో సవరణలు చేసింది. ఈ సవరణల ప్రకారం రెండు అధికారాలు సీఆర్‌డీఏకు, రాష్ట్ర ప్రభుత్వానికి వస్తాయి. రాజధానిలో పేదలకు ఇళ్ల పేరుతో స్థలాలు ఇవ్వడంతో పాటు రాజధాని భూములను టౌన్​షిప్​ల పేరుతో అమ్ముకోవటానికి, బదలాయించటానికి అధికారాలు సంక్రమిస్తాయి. మరోవైపు ఇప్పటికే విజయవాడ, గుంటూరు నగరాలకు చెందిన 28 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాల ముద్రణ పూర్తి అయ్యినట్టు సమాచారం.

ఇదీ చదవండి : కలంకారీ అంటే ఏంటి? ఒక్కో చీరను తాయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది?

ఈ జోన్లు అంటే ఏంటి...

ఆర్‌-1 అంటే.. ప్రస్తుత గ్రామాలు..

ఆర్‌-2 అంటే తక్కువ సాంద్రత గృహాలు..

ఆర్‌-3 అంటే తక్కువ నుంచి మధ్యస్థాయి సాంద్రత కలిగిన గృహాలు..

ఆర్‌-4 అంటే హైడెన్సిటీ జోన్‌ పేర్లతో 4 రకాల నివాస జోన్లు ఉండేవి.

ఆర్‌-5 కృష్ణాయపాలెం, వెంకటపాలెం, నిడమర్రు, కురగల్లు, మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలోని 967.25 ఎకరాలను నివాస ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. అందులోని 900.97 ఎకరాలను ఆర్‌-5 జోన్‌గా ఏర్పాటు

First published:

Tags: Amaravati, Andhra Pradesh, Ap capital, AP News, Cm jagan

ఉత్తమ కథలు