లారీని ఢీకొన్న గవర్నర్పేట ఆర్టీసీ బస్సు...ఇద్దరు మృతి
నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మండలంలోని ముత్యాలమ్మగూడెం దగ్గర సోమవారం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.
news18-telugu
Updated: February 12, 2019, 5:08 AM IST
news18-telugu
Updated: February 12, 2019, 5:08 AM IST
నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మండలంలోని ముత్యాలమ్మగూడెం దగ్గర సోమవారం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. అటుగా వస్తున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కండక్టర్ సహా ఇద్దరు మృతి చెందారు. అంతేకాకుండా.. 18 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన బస్సు.. కృష్ణా జిల్లా గవర్నర్పేట డిపోకు చెందినదిగా తెలుస్తోంది. ఈ బస్సు గవర్నర్పేట నుండి హైదరాబాద్ వస్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంపై మాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరి క్షతగాత్రులను దగ్గరలోని దవాఖానకు తరలించారు. ప్రమాదం జరగడానికి గల కారణాలు..గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Loading...