హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP News: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్.. అలా చేయకుంటే జీతాలు కట్..?

AP News: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్.. అలా చేయకుంటే జీతాలు కట్..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లాలనే కాన్సెప్ట్ తో గ్రామ, వార్డు సచివాలయాలను (Village, Ward Secretariats) తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 15వేల గ్రామ సచివాలయాల్లో లక్షా 30వేల మందికి పైగా ఉద్యోగులను నియమించింది.

ఇంకా చదవండి ...

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లాలనే కాన్సెప్ట్ తో గ్రామ, వార్డు సచివాలయాలను (Village, Ward Secretariats) తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 15వేల గ్రామ సచివాలయాల్లో లక్షా 30వేల మందికి పైగా ఉద్యోగులను నియమించింది. వీరి నియామకం పూర్తై రెండున్నరేళ్లు గడచినా ఇంతవరకు ప్రొబేషన్ ఖరారు చేయలేదు. ఉద్యోగాలు పర్మినెంట్ కాకపోవడంతో ఆందోళన చెందుతున్న ఉద్యోగులకు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఇకపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులంతా రోజుకు మూడుసార్లు హాజరు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 10 గంటల లోపు, మధ్యాహ్నం 3గంటలకు, సాయంత్రం 5గంటలకు అంటే రోజుకు మూడుసార్లు యాప్ ద్వారా అటెండెన్స్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లో యాప్ డౌన్ లోడ్ చేసుకొని హాజరు వేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. ఈ విధానం శనివారం నుంచి అమల్లోకి రానుంది.

ప్రభుత్వ ఆదేశాలపై ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ప్రొబేషన్ ఖరారు చేయకుండా తమ ఉద్యోగాలను ప్రశ్నార్ధకం చేసిన ప్రభుత్వం రోజుకు మూడుసార్ల హాజరు వేసుకోవాలనడం సరికాదంటున్నారు. ఐతే ఉన్నతాధికారులు మాత్రం ప్రతిరోజూ జరిగే స్పందన కార్యక్రమానికి ఇబ్బందులు తలెత్తకూడదనే ఇలా చేస్తున్నట్లు చెబుతున్నారు. ఉదయం ఆఫీసుకు వచ్చినప్పుడు.. స్పందన సమయంలో సచివాలయంలో ఉన్నారా..? లేదా..? అని తెలుసుకోవడానికి మాత్రమే మూడుసార్లు హాజరును అమలు చేస్తున్నామంటున్నారు.

ఇది చదవండి: జగన్ గ్యాంబ్లింగ్ సీఎం.. వైఎస్ సేల్స్ మేన్.. ఏపీలో పవన్ ఎఫెక్ట్ గ్యారెంటీ.. 


సచివాలయ ఉద్యోగులు చాలాచోట్ల ఉదయం 10 గంటలకు బయోమెట్రిక్ వేసి ఫీల్డ్ విజిట్ పేరుతో బయట ఉంటున్నారని.. మళ్లీ సాయంత్రం వచ్చి బయోమెట్రిక్ వేస్తున్నారన్న ఆరోపణలున్నట్లు అధికారులుంటున్నారు. దీనివల్ల స్పందనలో వచ్చే ఫిర్యాదులు నిర్లక్ష్యానికి గురవుతున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హాజరకు ప్రత్యేక యాప్ రూపొందించిన ప్రభుత్వం.. రెండు రోజుల క్రితమే డౌన్ లోడ్ చేసుకోవల్సిందిగా ఉద్యోగులను ఆదేశించింది.

ఇది చదవండి: విద్యార్థులకు అలర్ట్.. అమ్మఒడికి కొత్త రూల్స్ ఇవే..! లేకుంటే డబ్బులు రావు..!


ఇదిలా ఉంటే 2019 అక్టోబర్ లో ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను నియమిచింది. రెండేళ్ల తర్వాత ప్రొబేషన్ ఖరారు చేస్తామని ప్రకటించింది. ఐదే గత ఏడాది అక్టోబర్లోనే ప్రొబేషన్ ముగిసినా ఇంతవరకు ఖరారు చేయలేదు. డిపార్ట్ మెంట్ టెస్టులో చాలా మంది ఉత్తీర్ణత కాకపోవడం, జీతాలకు బడ్జెట్ లేకపోవడంతో ప్రభుత్వం వాయిదా వేసింది. జూన్ లో సచివాలయ ఉద్యోగులను పర్మిషనెంట్ చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ప్రొబేషన్ కోసం ఎదురుచూస్తున్న తమపై బయోమెట్రిక్ పేరుతో ఒత్తిడి పెంచుతున్నారని సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Ap government, Village secretariat

ఉత్తమ కథలు