హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

రూ. 100 మాత్రమే ఫైన్... వారికి సీఎం జగన్ గుడ్ న్యూస్

రూ. 100 మాత్రమే ఫైన్... వారికి సీఎం జగన్ గుడ్ న్యూస్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వాహనాలు వారికి అప్పగించేటప్పుడు కరోనా నివారణ కోవిడ్‌ జాగ్రత్తలపై అవగాహన కూడా కల్పించాలని పోలీసులు అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.

లాక్‌డౌన్ నియమ నిబంధనలను ఉల్లంఘించినందుకు సీజ్‌చేసిన వాహనాలను విడుదల చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి పోలీసులను ఆదేశించారు. ఈ సందర్భంగా మళ్లీ నియమాలను ఉల్లఘించబోమంటూ వాహనదారుల నుంచి హామీపత్రాన్ని తీసుకోవాలని ఆయన సూచించారు. లాక్‌డౌన్‌ పరిస్థితులపై అధికారులతో జరిగిన సమావేశంలో సీఎం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. రూ.100ల జరిమానాకు పరిమితం చేయాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టంచేశారు. వాహనాలు వారికి అప్పగించేటప్పుడు కరోనా నివారణ కోవిడ్‌ జాగ్రత్తలపై అవగాహన కూడా కల్పించాలని పోలీసులు అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.

అంతకుముందు ఇదే విషయాన్ని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా వెల్లడించారు. వాహనాలకు సంబంధించిన సరైన ధ్రువపత్రాలను సంబంధిత పోలీసు స్టేషన్‌లో సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆ మేరకు ఇప్పటికే జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు. వాహన యజమానులు సంబంధిత పోలీసు స్టేషన్‌లో సంప్రదించవచ్చని సూచించారు. అయితే వాహనం తీసుకెళ్లే సమయంలో ఎంత జరిమానా కట్టాలో అని టెన్షన్ పడుతున్న వాహనదారులకు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం ఊరట కలిగించనుంది.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Lockdown

ఉత్తమ కథలు