హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Big News: జీవో నెంబర్ 1..ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..విచారణ వాయిదా

Big News: జీవో నెంబర్ 1..ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..విచారణ వాయిదా

ఏపీ హైకోర్టు

ఏపీ హైకోర్టు

జీవో నెంబర్ 1పై ఏపీ హైకోర్టు (Ap High Court)లో నేడు విచారణ జరిగింది. ఈరోజు పిటీషనర్ తరపు వాదనలు ముగియగా..ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలను వినిపించారు. రేపు కూడా  అడ్వకేట్ జనరల్ వాదనలను వినిపించనున్నారు. బీజేపీ, జనసేన పిటీషన్లపై వాదనలు వినిపించనున్నారు. ఇక ప్రస్తుతం జీవో నెంబర్ 1పై అమలులో ఉన్న స్టేను పొడిగిస్తూ తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఈ క్రమంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

జీవో నెంబర్ 1పై ఏపీ హైకోర్టు (Ap High Court)లో నేడు విచారణ జరిగింది. ఈరోజు పిటీషనర్ తరపు వాదనలు ముగియగా..ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలను వినిపించారు. రేపు కూడా  అడ్వకేట్ జనరల్ వాదనలను వినిపించనున్నారు. బీజేపీ, జనసేన పిటీషన్లపై వాదనలు వినిపించనున్నారు. ఇక ప్రస్తుతం జీవో నెంబర్ 1పై అమలులో ఉన్న స్టేను పొడిగిస్తూ తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఈ క్రమంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Breaking News: నారా లోకేష్ 'యువగళం' పాదయాత్రకు లైన్ క్లియర్

వెకేషన్ బెంచ్ డీఫాక్టో చీఫ్ జస్టిస్ లా వ్యవహరించింది. ఈ కేసును స్వీకరించడం ద్వారా వెకేషన్ బెంచ్ పరిధిని మించి వ్యవహరించిందన్నారు. ప్రతీ కేసు ముఖ్యమైంది అంటూ వెళితే హైకోర్టు ఏమై పోవాలని వ్యాఖ్యానించింది. ఇలాంటివి జరిగితే ప్రతీ వెకేషన్ జడ్జి చీఫ్ జస్టిస్ అయిపోయినట్టే. కేసు మూవెళ్లి చూస్తే ఈ కేసు అంత ఎమర్జెన్సీ కూడా అనిపించలేదు. కేసు గురించి దాని మూలాల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నానని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు. నాకేమి తెలియదు అనుకోవద్దు. రిజిస్ట్రీ ఎప్పటికప్పుడు  నివేదించింది.

Big News: ఏపీ ఉద్యోగుల సంఘానికి నోటీసులు..అప్పటివరకు సర్కార్ డెడ్ లైన్!

హైకోర్టు చీఫ్ జస్టిస్ గా నా అధికారాలను ఉపయోగిస్తానని చీఫ్ జస్టిస్ అన్నారు. నా పిటీషన్ స్వీకరించాలంటూ వెకేషన్ కోర్టు ముందు ధర్నా ఏమైనా జరిగిందా అంటూ చీఫ్ ప్రశ్నించారు. అంత అర్జెంట్ గా వెకేషన్ బెంచ్ లో లంచ్ మోషన్ ఎందుకు వేశారంటూ ప్రశ్నించారు. ఎలాంటి ఎమర్జెన్సీ లేనప్పుడు లంచ్ మోషన్ వేయాల్సిన అవసరం ఏంటని అభిప్రాయపడ్డారు. నాకేమి తెలియదు అనుకుంటే పొరపాటే. ప్రతీ విషయం నాకు తెలుసు అని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవోను వ్యతిరేకిస్తూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) వేసిన పిటీషన్ పై విచారణ జరిపిన హైకోర్టు జీవోను  సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో హైకోర్టు  (Ap High Court) ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించింది. ఈ మేరకు స్పెషల్ లీవ్ పిటీషన్ ను దాఖలు చేసింది. ఈ పిటీషన్ పై విచారణ జరిపి హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయడానికి నిరాకరిస్తూ ఈ కేసు హైకోర్టులో ఉన్నందున జోక్యం చేసుకోలేమని  సుప్రీంకోర్టు  (Supreme Court) పేర్కొంది. ఈ కేసును హైకోర్టు జస్టిస్ విచారణ జరపాలని ఆదేశించింది. దీనితో నేడు హైకోర్టు (Ap High Court) విచారణ జరిపి రేపటికి వాయిదా వేసింది.

First published:

Tags: Andhrapradesh, Ap, AP High Court, AP News

ఉత్తమ కథలు